లవ్ జిహాద్ కేసు: హదియాను కోర్టుకు తీసుకురావాలన్న సుప్రీం
గత కొంత కాలంగా కేరళ రాష్ట్రంలో ‘లవ్ జిహాద్’ కేసులు పెరిగిపోతున్నాయి. హిందూ మతానికి చెందిన అమ్మాయిలను ప్రేమ పేరుతో వలలో వేసుకుని మతం మార్చి పెళ్లి చేసుకోవడాన్నే ‘లవ్ జిహాద్’గా పేర్కొంటున్నారు.
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా కేరళ రాష్ట్రంలో 'లవ్ జిహాద్' కేసులు పెరిగిపోతున్నాయి. హిందూ మతానికి చెందిన అమ్మాయిలను ప్రేమ పేరుతో వలలో వేసుకుని మతం మార్చి పెళ్లి చేసుకోవడాన్నే 'లవ్ జిహాద్'గా పేర్కొంటున్నారు. కాగా, ఇస్లామిక్ స్టేట్తో లింకులు ఉన్న వారు హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్న ఘటనలు కేరళలో ఇటీవలి కాలంలో పెరిగిపోతుండటం వారి తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలోనే హదియా అనే 24 ఏళ్ల అమ్మాయి కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ముందు సోమవారం వాదనలు జరిగాయి. హదియాను విచారణ కోసం నవంబర్ 27వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు కోర్టుకు తీసుకురావాలంటూ సుప్రీం ఆదేశించింది. హదియా మేజర్ అయినందున ఆమె అభిప్రాయమే ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది. కాగా, తన కుమార్తెను బలవంతంగా మతం మార్చారని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు.

కాగా, హదియా అసలు పేరు అఖిలా అశోకన్. మతం మార్చుకుని ఫాహిన్ జెహాన్ అనే ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే, అయితే షాఫిన్ జెహాన్కు ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలు ఉన్నాయని ఆమె తండ్రి ఆరోపించాడు. కేరళ కోర్టు వరకు వీళ్ల కేసు వెళ్లింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు షాఫిన్ నుంచి హదియాను దూరం చేశారు.
గత ఐదు నెలలుగా ఆ అమ్మాయి తండ్రి దగ్గరే ఉంటోంది. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరుకుంది.దీంతో నవంబర్ 27వ తేదీన జరిగే విచారణను కెమెరాల్లో చిత్రీకరించాలని హదియా తండ్రి కోర్టును కోరాడు. కానీ, న్యాయమూర్తి దీపక్ మిశ్రా మాత్రం ఆ అభ్యర్థనను తోసిపుచ్చారు. ఓపెన్ కోర్టులోనే విచారణ సాగుతుందన్నారు. కేరళలో లవ్ జిహాద్ కేసులు ఎక్కువవుతున్నాయని ఇటీవలే ఎన్ఐఏ హెచ్చరించడం గమనార్హం. ఇప్పటికే 89కేసులకు పైగా గుర్తించినట్లు తెలిసింది. కోర్టు ఆదేశాలతో ఈ లవ్ జిహాద్ కేసులపై ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications