Khiladi lady: ఫైనాన్స్, గోల్డ్ లోన్ ఆఫీసులో హెడ్, కిలాడీ కార్తీకా, నకిలి నగలతో రూ. 40 లక్షలు !

చెన్నై/ కోయంబత్తూరు: ప్రముఖ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ, భారీ మొత్తంలో గోల్డ్ లోన్స్ ఇస్తున్న సంస్థలో ఓ మహిళ ఉద్యోగం చేస్తున్నది. బ్రాంచ్ మేనేజర్ కంటే ఉన్నతస్థాయి ఉద్యోగం, బ్రాంచ్ కార్యాలయం హెడ్ కావడంతో ఆ కార్యాలయంలో ఉద్యోగాలు చేస్తున్న అందరూ ఆమె చెప్పినట్ల నడుచుకుంటున్నారు. బ్రాంచ్ మేనేజర్ సైతం ఆమె ఏమి చెప్పినా ఎస్ మేడమ్ అంటున్నాడు. ఇటీవల హెడ్ ఆఫీసు నుంచి వెళ్లిన అధికారులు ఆ కార్యాలయంలో ఆడిటింగ్ చేసి బంగారు నగలు పరిశీలించారు. దెబ్బకు అధికారుల మైండ్ బ్లాక్ అయ్యింది. నకిలి నగలు కదువ పెట్టి రూ. 40 లక్షలకు పైగా రుణం తీసుకున్నారని వెలుగు చూసింది. దెబ్బకు కంపెనీ హెడ్ ను అరెస్టు చెయ్యడంతో బ్రాంచ్ మేనేజర్ తో సహ అక్కడ పని చేస్తున్న కొందరు ఉద్యోగులు జెండా ఎత్తేయడం కలకలం రేపింది.

 కేరళలో హెడ్ ఆఫీసు... కోయంబత్తూరులో బ్రాంచ్ ఆఫీసు

కేరళలో హెడ్ ఆఫీసు... కోయంబత్తూరులో బ్రాంచ్ ఆఫీసు

కేరళకు చెంది ఐసీఎల్ ఫిన్ కార్ఫ్ కంపెనీ ఆ రాష్ట్రంలో భారీ మొత్తంలో ఫైనాన్స్ వ్యాపారం, గోల్డ్ లోన్ ఇస్తున్నది. ఐసీఎల్ ఫిన్ కార్ఫ్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ, భారీ మొత్తంలో గోల్డ్ లోన్స్ ఇస్తున్న సంస్థ తమిళనాడులోని కోయంబత్తూ సిటీలోలో బ్రాంచ్ ఆఫీసు ప్రారంభించింది. కోయంబత్తూరు కార్యాలయంలో కార్తీక అనే మహిళ ఉద్యోగం చేస్తున్నది.

 బ్రాంచ్ మేనేజర్ కంటే ఎక్కువ

బ్రాంచ్ మేనేజర్ కంటే ఎక్కువ

కోయంబత్తూరు బ్రాంచ్ కార్యాలయంలో శరవణన్ అనే వ్యక్తి మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్ గా సత్యా కూడా ఉద్యోగం చేస్తున్నాడు. బ్రాంచ్ మేనేజర్ శరవణన్ కంటే కార్తీకాది ఉన్నతస్థాయి ఉద్యోగం, కార్తీకా బ్రాంచ్ కార్యాలయం హెడ్ కావడంతో ఆ కార్యాలయంలో ఉద్యోగాలు చేస్తున్న అందరూ ఆమె చెప్పినట్ల నడుచుకుంటున్నారు.

 నకిలి నగలు కుదవపెట్టి రూ. 40 లక్షలు స్వాహా

నకిలి నగలు కుదవపెట్టి రూ. 40 లక్షలు స్వాహా

బ్రాంచ్ మేనేజర్ శరవణన్ సైతం కార్తీకా ఏమి చెప్పినా ఎస్ మేడమ్ అంటున్నాడు. కొంతకాలం క్రితం కార్తీకా బ్రాంచ్ మేనేజర్ శరవణన్, అసిస్టెంట్ మేనేజర్ సత్యా కలిసి నకిలి బంగారు నగలు కార్యాలయంలో కుదవపెట్టి వేరే వ్యక్తి పేరుతో రూ. 40.80 లక్షలు తీసుకున్నారు. నకిలి నగలు కుదవపెట్టి తీసుకున్న డబ్బులు కార్తీకా, శరవణన్, సత్యా పంచుకున్నారు.

 కేరళ నుంచి వెళ్లిన అధికారులు

కేరళ నుంచి వెళ్లిన అధికారులు

కేరళ హెడ్ ఆఫీసు నుంచి వెళ్లిన అధికారులు కోయంబత్తూరు కార్యాలయంలో ఆడిటింగ్ చేసి బంగారు నగలు పరిశీలించారు. నగలు పరిశీలించిన అధికారుల మైండ్ బ్లాక్ అయ్యింది. నకిలీ నగలు కదువ పెట్టి రూ. 40. 80 లక్షలకు పైగా రుణం తీసుకున్నారని వెలుగు చూసింది. కంపెనీ హెడ్ కార్తీకా బంగారు నగలు కుదవ పెట్టిందని వెలుగు చూడటంతో పోలీసు కేసు పెట్టారు. పోలీసులు కార్తీకాను అరెస్టు చెయ్యడంతో బ్రాంచ్ మేనేజర్ శరవణన్, అసిస్టెంట్ మేనేజర్ సత్యా పారిపోవడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+