Khiladi lady: భర్తకు గుడ్ బైయ్, తల్లి ప్రియుడితో కూతురి పెళ్లి, రొమాన్స్ సీక్రేట్, లేడీ ?
ముంబాయి/పూణే: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసి ఓ కూతురికి తల్లి అయ్యింది. దంపతుల మద్య గొడవలు ఎక్కువ కావడంతో విడిపోయారు. కూతురితో కలసి వేరుగా ఉంటున్న మహిళ ఆమె కంటే 9 ఏళ్ల వయసు తక్కువ ఉన్న యువకుడిని సెట్ చేసుకుని అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. మహిళ కోసం ఆమె ఇంటికి వెలుతున్న ప్రియుడు ఆంటీ కూతురి మీద కన్ను వేశాడు. ప్రియుడు ఆశపడ్డాడనని కన్న కూతురిని ప్రియుడికి ఇచ్చి బలవంతంగా పెళ్లి జరిపించింది. కన్న తల్లి కామానికి బలి అయిన అమ్మాయి మైనర్ కావడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.
Lady techie: భార్యను స్పాట్ లో చంపేసిన బ్యాంక్ మేనేజర్, లవ్ మ్యారేజ్, మరో టెక్కీతో భార్యకు !
భర్తకు గుడ్ బై చెప్పిన భార్య
మహారాష్ట్రలోని పూణేలోని చందన్ నగర్ లో 37 సంవత్సరాల వయసు ఉన్న రాగిణి శ్వేతా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న రాగిణి శ్వేతా ఆమె భర్తతో కాపురం చేసి ఓ కూతురికి తల్లి అయ్యింది. దంపతుల మద్య గొడవలు ఎక్కువ కావడంతో రాగిణి శ్వేతా ఆమె భర్తతో విడిపోయింది.
ప్రియుడిని సెట్ చేసుకుంది
రాగిణి శ్వేతా కూతురికి ప్రస్తుతం 15 ఏళ్లు. కూతురితో కలసి వేరుగా ఉంటున్న రాగిణి శ్వేతాకు ఆమె కంటే 9 ఏళ్ల వయసు తక్కువ ఉన్న కిరణ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడికి పరిచయం అయ్యింది. 28 ఏళ్ల వయసు ఉన్న కిరణ్ వివాహిత మహిళ రాగిణి శ్వేతాను సెట్ చేసుకుని ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు.
ప్రియురాలి కూతురి మీద కన్ను..... కన్నింగ్ లేడీ స్కెచ్
రాగిణి శ్వేతా ఎంజాయ్ చెయ్యడానికి కిరణ్ నేరుగా ఆమె ఇంటికే వెళ్లి వస్తున్నాడు. ప్రియురాలు రాగిణి కోసం ఆమె ఇంటికి వెళ్లి వస్తున్న కిరణ్ ఆంటీ కూతురి మీద కన్ను వేశాడు. తన కూతురిని కిరణ్ పెళ్లి చేసుకుంటే అందరూ ఒకే ఇంటిలో ఉండటానికి అవకాశం ఉంటుందని, తన అక్రమ సంబంధం విషయం బయటకురాదని రాగిణి శ్వేతా కన్నింగ్ స్కెచ్ వేసింది.
తల్లి ప్రియుడితో కూతురి పెళ్లి
మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ లోని ఓ గుడిలో 15 ఏళ్ల కన్న కూతురిని తన ప్రియుడు కిరణ్ కు ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసిన రాగిణి శ్వేతా ఆమె అనుకున్న పని చేసింది. తల్లి ప్రియుడిని పెళ్లి చేసుకున్న మైనర్ అమ్మాయి ఆమె స్నేహితుడు మ్యాటర్ మొత్తం చెప్పింది. మైనర్ అమ్మాయి స్నేహితుడు సమాజసేవకురాలికి సమాచారం ఇచ్చారు.
సీన్ రివర్స్ తో ?
రాగిణి శ్వేత మీద చందన్ నగర్ పోలీసులకు సమాజసేవకురాలు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తే రాగిణి శ్వేతా సినిమా స్టోరీ చెప్పింది. తన ప్రియుడు కిరణ్ ను పెళ్లి చేసుకోకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని తన తల్లి బెదిరించిందని, అందుకే పెళ్లి చేసుకున్నానని మైనర్ అమ్మాయి పోలీసులకు చెప్పింది. తల్లి, ఆమె ప్రియుడి మీద ఫోక్స్ చట్టం, బాల్య వివాహం చేశారని తదితర సెక్షల కింద కేసులు నమోదు చేశామని పూణేలోని చందన్ నగర్ పోలీసులు తెలిపారు.