మోడీపై ఖుష్బూ వ్యాఖ్యలు.. ఆ ట్వీట్ తో టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్!!
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏఐసిసి మాజీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో పరువు నష్టం దావా వేసిన కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీకి జైలు శిక్ష పడిన నేపథ్యంలో లోక్సభలో రాహుల్ గాంధీ సభ్యత్వం పై నిన్న అనర్హత వేటు వేశారు. ఇక ఈ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తుంటే, ప్రధాని మోడీ ఇంటిపేరు పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో ఆయనకు జైలు శిక్ష విధిస్తే, మరి మోడీ చేసిన వ్యాఖ్యల మాటేమిటి అంటూ ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి 2018 రాజ్యసభలో ప్రధాని మోడీ తనను శూర్పణఖతో పోల్చారని, నాటి వీడియోను పోస్ట్ చేసి తాను కూడా పరువు నష్టం దావా వేస్తామన్నారు. దీనిపై కోర్టు ఎంత తొందరగా స్పందిస్తుందో చూస్తానని పేర్కొన్నారు. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఇటీవల నియామకం కాబడిన బిజెపి నాయకురాలు ఖుష్బూ సుందర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Yahan #Modi wahan #Modi jahan dekho #Modi..lekin yeh kya?? Har #Modi ke aage #bhrashtachaar surname laga hua hai..toh baat ko no samjho..#Modi mutlab #bhrashtachaar..let's change the meaning of #Modi to corruption..suits better..#Nirav #Lalit #Namo = corruption..👌👌😊😊
— KhushbuSundar (@khushsundar) February 15, 2018
బిజెపి నేత ఖుష్బూ సుందర్ మోడీ ఇంటిపేరు అవినీతిని సూచిస్తుందని 2018 వ సంవత్సరంలో ట్వీట్ చేశారని, దొంగలు అందరికీ సాధారణంగా మోడీ ఇంటి పేరు ఎలా వచ్చింది అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కాంగ్రెస్లో ఉన్న సమయంలో ఖుష్బూ సుందర్ ఈ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు ఖుష్బూ కాంగ్రెస్ కు టార్గెట్ అయింది.
मोदी जी @narendramodi क्या आप @khushsundar पर भी मान हानि का मुक़दमा मोदी नाम वाले अपने किसी शिष्य से दायर करवाएँगे? अब तो वे @BJP4India की सदस्य हैं। देखते हैं। धन्यवाद @zoo_bear @INCIndia @RahulGandhi https://t.co/qIibuycY6n
— digvijaya singh (@digvijaya_28) March 25, 2023
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గతంలో మోడీ, ఆయన ఇంటి పేరు పై ఆరోపణలు చేసిన ఖుష్బూ సుందర్ పై పరువు నష్టం దావా వేస్తారా? ప్రస్తుతం ఆమె బిజెపిలో నాయకురాలుగా ఉన్నారు కదా అంటూ సంచలన పోస్ట్ పెట్టారు. ఆమెకు కూడా బిజెపి శిక్ష వేయిస్తుందా చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఇక దీనిపై ఖుష్బూ సుందర్ ఇంతవరకు స్పందించలేదు. కనీసం ఆ ట్వీట్ ను కూడా డిలీట్ చేయలేదు.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications