కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్, క్రికెటర్లు అరెస్టు, సీసీబీ ఎంట్రీ, లుక్ ఔట్ నోటీసులు, విదేశాల్
బెంగళూరు: కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) క్రికెట్ మ్యాచ్ ల్లో క్రికెట్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ క్రికెటర్లను సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్టు చేశారు. బళ్లారి టస్కర్స్ టీం క్యాప్టెన్ సీఎం. గౌతమ్, అబ్రార్ ఖాజీ అనే ఇద్దరిని సీసీబీ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
2019 కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) క్రికెట్ మ్యాచ్ ల్లో క్రికెట్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని సీసీబీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 2019 ఆగస్టు 31వ తేదీన బళ్లారి టస్కర్స్, హుబ్బళ్లి టైగర్స్ జట్ల మధ్య కేపీఎల్ ఫైనల్స్ మైసూరులో జరిగాయి.

బళ్లారి టస్కర్స్, హుబ్బళ్ళి టైగర్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్స్ లో క్రికెట్ బెట్టింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి బెళగావి ఫ్యాంథర్స్ టీం యజమాని అష్వఖ్ ఆలీ తార్, బళ్లారి టస్కర్స్ టీం డ్రమ్మర్ భవేష్, బెంగళూరు బ్లాస్టర్స్ టీం బౌలింగ్ కోచ్ విను ప్రసాద్, బ్యాట్స్ మెన్ విశ్వనాథన్ ను సీసీబీ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
బళ్లారి టస్కర్స్, హుబ్బళ్ళి టైగర్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్స్ లో క్రికెట్ బెట్టింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కు సంబంధించి సీసీబీ పోలీసులు కేసు విచారణ ముమ్మరం చేశారు. ఇదే కేసులో ఢిల్లీకి చెందిన ఇద్దరు బుక్కీలను అరెస్టు చెయ్యడానికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. క్రికెట్ బుక్కీలు జత్తిన్, సయ్యాం విదేశాల్లో తలదాచుకున్నారని సీసీబీ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications