వేగంగా వెలుతున్న ఆర్ టీసీ బస్సులో నుంచి కాలేజ్ అమ్మాయిని బయటకు తోసేసిన కండెక్టర్ !
బెంగళూరు: బస్సు పాస్ ను అనుమతించనని, టిక్కెట్ తీసుకోవాలని కాలేజ్ అమ్మాయితో గొడవ పెట్టుకున్న ఆర్ టీసీ కండెక్టర్ వేగంగా వెలుతున్న బస్సులో నుంచి ఆమెను కిందకు తోసేసిన దారుణ ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఆర్ టీసీ బస్సులో నుంచి కండెక్టర్ బయటకు తోసేడంతో తీవ్రగాయాలైన కాలేజ్ విద్యార్థిని భూమిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసులు అన్నారు.
బెంగళూరు నగరంలోని జ్యోతి కేంద్ర విద్యాలయంలో కనకపురలో నివాసం ఉంటున్న భూమిక అనే అమ్మాయి పీయూసీ (ఇంటర్) మొదటి సంవత్సరం చదువుతోంది. సాయంత్రం కాలేజ్పూర్తి అయిన తరువాత కనకపురలోని ఇంటికి వెళ్లడానికి భూమిక కేఎస్ఆర్ టీసీ బస్సు ఎక్కింది.

కేఎస్ఆర్ టీసీ బస్సు కండెక్టర్ టిక్కెట్ తీసుకోవాలని భూమికకు చెప్పాడు. తనకు బస్సు పాస్ ఉందని, టిక్కెట్ అవసరం లేదని భూమిక సమాధానం ఇచ్చింది. ఆ సమయంలో తన బస్సులో కాలేజ్ బస్సు పాస్ లు అనుమతించనని, కచ్చితంగా టిక్కెట్ తీసుకోవాలని కండెక్టర్ కాలేజ్ అమ్మాయి భూమికతో గొడవ పెట్టుకున్నాడు.
బస్సు పాస్ ఎందుకు అనుమతించవని భూమిక కండెక్టర్ తో వాదించింది. ఆ సమయంలో తన బస్సులో తాను చెప్పిందే వేదం, నువ్వు టిక్కెట్ తీసుకుంటేనే నా బస్సులో రావాలని, లేదంటే కిందకు దిగాలని కండెక్టర్ రెచ్చిపోయాడు. తన దగ్గర టిక్కెట్ కు డబ్బులు లేవని, మార్గం మద్యలో బస్సు దిగితే చాలా దూరం నడవాలని, తరువాత వచ్చే బస్సు స్టాప్ లో దిగేస్తానని భూమిక మనవి చేసింది.
ఇప్పుడే ఇక్కడే బస్సు దిగాలని కండెక్టర్ భూమికను హెచ్చరించాడు. మార్గం మద్యలో బస్సు దిగడానికి భూమిక నిరాకరించింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన కండెక్టర్ వేగంగా వెలుతున్న బస్సులో నుంచి భూమికను బయటకు తోసేశాడు. భూమిక తల, ముఖం, ఎద, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
కాలేజ్ విద్యార్థిని బస్సులో నుంచి బయటకు తోసేసిన కండెక్టర్ కు అదే బస్సులోని ప్రయాణికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. కండెక్టర్ ను సస్పెండ్ చేసి విచారణ చేస్తున్నామని కేఎస్ఆర్ టీసీ అధికారులు చెప్పారు. కాలేజ్ అమ్మాయిని బస్సులో నుంచి కిందకు తోసేసిన కండెక్టర్ పేరు బయటకు రాకుండా కేఎస్ఆర్ టీసీ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications