మోడీకి, బీజేపీకి తమిళనాడులో చోటు లేదు : ఖుష్బూ, అందుకే #GoBackModi ట్రెండింగ్
చెన్నై : ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అటు నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా మోడీ టూర్ పై నిరసన తెలిపారు. గతేడాది సంభవించిన గజ తుపాన్ కారణంగా అతలాకుతలమైన తమిళనాడుపై, ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని విరుచుకుపడ్డారు. అదలావుంటే అటు బీజేపీ నేతలు మోడీకి మధురైలో ఘనస్వాగతం పలికారు.

మోడీ తమిళనాడు పర్యటనపై ఆరోపణలు గుప్పించారు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి ఖుష్బూ. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. తమిళనాడులో మోడీకి, బీజేపీకి చోటు లేదని పేర్కొన్నారు. ఇక్కడ కమలం వికసించబోదని రాశారు. రాష్ట్రానికి మోడీ వస్తానంటే ఇక్కడి ప్రజలు గో బ్యాక్ మోడీ అంటూ ట్రెండింగ్ చేస్తున్నారని.. అలాంటిది ఎన్నికల్లో ఎలా గెలిపిస్తారంటూ చురకలంటించారు. అయితే సోషల్ మీడియాలో మోడీకి వ్యతిరేకంగా పోస్టులు వైరల్ కావడంతో.. బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్. రాజా తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతి శ్రీనివాసన్ ట్వీట్ల యుద్ధం మొదలుపెట్టారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications