Lady: కాలేజ్ లేడీ ప్రొఫెసర్, యూనివర్శిటీలో భర్త రిజిస్టార్, ఉరి వేసుకున్న మేడమ్, డెత్ నోట్ !
బెంగళూరు: ఉన్నత విద్యాభ్యాసం చేసిన మహిళ కాలేజ్ లో ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నారు. లేడీ ప్రొఫెసర్ భర్త ప్రముఖ యూనివర్శిటీలో రిజిస్టార్ గా ఉద్మోగం చేస్తున్నారు. ఉద్యోగరిత్యా భర్త ఒక జిల్లాలో, భార్య రాష్ట్ర రాజధానిలో నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు ఎవరిపాటికి వాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు. సెలవుల సమయంలో భర్త సొంత ఇంటికి చేరుకుని ఆయన భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. యూనివర్శిటీకి వెలుతున్న భర్త అతని భార్యకు ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు. ఎప్పటిలాగా ఫోన్ చేసిన భర్త ఆయన భార్య ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో అనుమానం వచ్చింది. లేడీ ప్రొఫెసర్ సోదరుడికి ఫోన్ చేసిన ఆమె భర్త ఇంటికి దగ్గరకు వెళ్లి చూడాలని చెప్పారు. తమ్ముడు వెళ్లి చూడగా లేడీ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. లేడీ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకునే ముందు లేడీ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె డెత్ నోట్ రాసిపెట్టారని పోలీసు అధికారులు తెలిపారు.
సంతోషంగా జీవిస్తున్న దంపతులు
బెంగళూరు నగరంలోని కదంబ నగర్ లో చైత్రా అనే మహిళ నివాసం ఉంటున్నారు. 23 ఏళ్ల క్రితం చైత్రా సీటీ. గురుప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. చైత్రా, గురుప్రసాద్ ఉన్నత చదువులు చదివారు. వివాహం చేసుకున్న తరువాత గురుప్రసాద్, చైత్రా దంపతులు బెంగళూరులోనే చాలా సంవత్సరాలు కాపురం ఉన్నారు.
భర్త రిజిస్టార్, భార్య ప్రొఫెసర్
చైత్రా బెంగళూరులోని ప్రముఖ కాలేజ్ లో ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నారు. చైత్ర భర్త గురుప్రసాద్ శిగ్గావిలోని కర్ణాటక జానపది విశ్వవిద్యాలయం యూనివర్శిటీలో రిజిస్టార్ గా ఉద్యోగం చేస్తున్నారు. హావేరిలో గురుప్రపాద్ నివాసం ఉంటున్నారు. బెంగళూరులోని కదంబ నగర్ లో నివాసం ఉంటున్న చైత్రా ప్రతిరోజు కాలేజ్ లో విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి వెలుతున్నారు.
ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో డౌట్
సెలవుల సమయంలో చైత్రా భర్త గురుప్రసాద్ బెంగళూరు చేరుకుని సొంత ఇంటిలో ఆయన భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. యూనివర్శిటీకి వెలుతున్న గురుప్రసాద్ ఆయన భార్య చైత్రాకు ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు. ఎప్పటిలాగా చైత్రాకు ఫోన్ చేసిన ఆమె భర్త గురుప్రసాద్ ఆయన భార్య ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో అనుమానం వచ్చింది.
తమ్ముడు వెళ్లి చూసి షాక్
లేడీ ప్రొఫెసర్ చైత్రా సోదరుడికి ఫోన్ చేసిన ఆమె భర్త గురుప్రసాద్ కందబ నగర్ లోని ఇంటికి దగ్గరకు వెళ్లి చూడాలని చెప్పారు. తమ్ముడు వెళ్లి చూడగా లేడీ ప్రొఫెసర్ చైత్రా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. లేడీ ప్రొఫెసర్ చైత్రా ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె డెత్ నోట్ రాసిపెట్టారని పోలీసు అధికారులు తెలిపారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, నా ఆత్మహత్యకు ఎవరు బాధ్యలుకాదని చైత్రా డెత్ నోట్ రాసిపెట్టారని. కేసు విచారణలో ఉందని కేసు విచారణ చేస్తున్న బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.