Lady: అర్దరాత్రి బెడ్ రూమ్ లో ఏం జరిగిందో ఏమో ?, భార్య గొంతు చీల్చి చంపేసిన భర్త, చెయ్యి !
బెంగళూరు/శివమొగ్గ: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఇద్దరు పిల్లలు పుట్టారు. కొంతకాలంగా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. బందువులు, పెద్దలు రాజీ చేసినా దంపతుల మద్య సమస్యలు పరిష్కారం కాలేదు. అయితే దంపతుల మద్యగొడవలకు అసలు మ్యాటర్ మాత్రం ఇద్దరు బయటపెట్టలేదు. రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేసిన దంపతులు వారి బెడ్ రూమ్ లోకి వెళ్లారు. పిల్లలు మరో బెడ్ రూమ్ లోకి వెళ్లారు. అర్దరాత్రి భార్య గొంతు చీల్చి దారుణంగా హత్య చేసిన భర్త తరువాత అతను చేతి నరాలు కోసుకున్నాడు.
పిల్లలతో సంతోషంగా ఉన్నారు
కర్ణాటకలోని శివమొగ్గ సిటీలోని ప్రియాంక లేఔట్ లో దినేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం దినేష్ మంజుల (35) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం వరకు మంజుల, దినేష్ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. మంజుల, దినేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
దంపతుల మద్య గొడవలు
కొంతకాలంగా మంజుల, దినేష్ దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. బందువులు, పెద్దలు రాజీ చేసినా దినేష్, మంజుల దంపతుల మద్య సమస్యలు పరిష్కారం కాలేదు. అయితే మంజుల, దినేష్ దంపతుల మద్య గొడవలకు కారణం ఏమిటి అనే విషయం వాళ్ల బందువులకే తెలీదని సమాచారం. దినేష్ కాని, మంజుల కాని అసలు మ్యాటర్ మాత్రం బయటపెట్టలేదు.
భార్యను చంపేసి చేతులు కోసుకున్న భర్త
రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేసిన మంజుల, దినేష్ దంపతులు వారి బెడ్ రూమ్ లోకి వెళ్లారు. పిల్లలు మరో బెడ్ రూమ్ లోకి వెళ్లారు. అర్దరాత్రి మంజుల, దినేష్ గొడవపడ్డారు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన దినేష్ అతన భార్య మంజుల గొంతు చీల్చి ఆమెను దారుణంగా హత్య చేశాడు. తరువాత అదే రూమ్ లో దినేష్ అతని చేతి నరాలు కోసుకున్నాడు.
పిల్లలు బెడ్ రూమ్ లో చూస్తే మ్యాటర్ తెలిసింది
ఉదయం నిద్రలేచిన పిల్లలు విషయం గుర్తించి సమీపంలో నివాసం ఉంటున్న బంధువులకు సమాచారం ఇచ్చారు. బందువులు వెళ్లి చూసే సమయానికి మంజుల ప్రాణం పోయింది, చలనం లేకుండా బెడ్ కిందపడి ఉన్న దినేష్ ను ఆసుపత్రికి తరలించారు. దినేష్ కోలుకున్న తరువాతే మంజుల హత్యకు అసలు కారణం తెలుస్తోందని శివమొగ్గ పోలీసులు అంటున్నారు.