Lady: బ్యూటీ సెలూన్ ప్రభు హత్య కేసులో ట్విస్ట్, కవిత, బాయ్ ఫ్రెండ్ అండ్ కో అందర్, మ్యాటర్ ? !
కోయంబత్తూర్/ చెన్నై: బ్యూటీ సెలూన్ కు అమ్మాయిలు, మహిళలకు వెళ్లి వస్తున్నారు. బ్యూటీ సెలూన్ లో ఉద్యోగం చేస్తున్న యువకుడు మహిళలతో చనువుగా ఉంటున్నాడు. రోడ్డు పక్కన ఓ యువకుడి చెయ్యి మాత్రమే చిక్కడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బ్యూటీ సెలూన్ లో పని చేసే వ్యక్తి కనపడటం లేదని కేసు నమోదు అయ్యిందని పోలీసులకు తెలిసింది. ఇదే సందర్బంలో తల లేని ముక్కలు ముక్కలు అయిన యువకుడి మొండెం, కాళ్లు, ఒక చెయ్యి బావిలో చిక్కాయి. బ్యూటీ సెలూన్ లో పని చేసే యువకుడే దారుణ హత్యకు గురైనాడని వెలుగు చూసింది. బ్యూటీ సెలూన్ యువకుడిని హత్య చేసి అతని శవాన్ని 12 ముక్కలు చేసి అనేక ప్రాంతాల్లో విసిరేసిన ఓ లేడీతో సహ ముగ్గురు పోలీసులకు చిక్కిపోయారు.
Boyfriend: భర్తకు విడాకులు, సిట్టింగ్ లవర్ తో కలిసి మాజీ బాయ్ ఫ్రెండ్ ను ?, లిక్కర్ పార్టీ ?
మహిళలతో చనువుగా ఉన్నాడు
తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలోని ఓ ప్రముఖ బ్యూటీ సెలూన్ లో ఈరోడ్ కు చెందిన ప్రభు ఉద్యోగంలో చేరాడు. ఈరోడ్ నుంచి కోయంబత్తూరు వచ్చి బ్యూటీ సెలూన్ లో ఉద్యోగం చేస్తున్న ప్రభు బ్యూటీ సెలూన్ కు వచ్చి వెలుతున్న కొందరు అమ్మాయిలు, మహిళలతో చనువుగా ఉంటున్నాడు.
హత్యకు గురైన బ్యూటీ పార్లల్ ఉద్యోగి
కోయంబత్తూరు సిటీ సమీపంలోని దుడియలూరులోని వెల్లకినారు ప్రాంతంలో ఓ యువకుడి చెయ్యి మాత్రమే చిక్కడం కలకలం రేపింది. పోలీసుల విచారణలో బ్యూటీ సెలూన్ లో పని చేసే ప్రభు హత్యకు గురైనాడని వెలుగు చూసింది. మరుసటి రోజు ప్రభు తల లేని ముక్కలు ముక్కలు అయిన మొండెం, కాళ్లు, ఒక చెయ్యి బావిలో చిక్కాయి.
అక్రమ సంబంధం
బ్యూటీ సెలూన్ లో పని చేసే ప్రభు దారుణ హత్యకు గురైనాడని వెలుగు చూడటం కోయంబత్తూరులో కలకలం రేపింది. బ్యూటీ సెలూన్ కు వెళ్లి వస్తున్న కొందరు యువతులు, అమ్మాయిలతో ప్రభు చాలా చనువుగా ఉంటున్నాడని, ఇద్దరితో అతనికి అక్రమ సంబంధం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
లేడీతో సహ ముగ్గురి అరెస్టు
అక్రమ సంబంధం కారణంగానే ప్రభును దారుణంగా హత్య చేసి అతని శరీర అవయవాలు అక్కడక్కడా విసిరేశారని పోలీసులు అన్నారు. బ్యూటీ సెలూన్ ఉద్యోగి ప్రభు హత్య కేసులో కవిత, ఆమె బాయ్ ఫ్రెండ్ అమూల్ దివాకర్, కార్తీక్ అనే ముగ్గురిని అరెస్టు చేశామని కోయంబత్తూరు పోలీసులు చెప్పారు.
12 ముక్కలు చేసి విసిరేశారు
గతంలో కవిత, ప్రభు చాలా చనువుగా ఉన్నారని, ఇదే విషయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ అమూల్ దివాకర్ కక్ష పెంచుకున్నారని, ఇదే విషయంలో ప్రభును పక్కాప్లాన్ తో హత్య చేశారని పోలీసులు అన్నారు. ప్రభు శవాన్ని 12 ముక్కలు చేసి ముగ్గురు నాలుగు నాలుగు ముక్కలు తీసుకెళ్లి ఎక్కడంటే అక్కడ విసిరేశారని పోలీసులు అన్నారు. నిందితులు ముగ్గురిని కోర్టు ముందు హాజరుపరిచామని పోలీసులు తెలిపారు.