జైల్లో చలిగా ఉంది! ఐతే తబలా వాయించు!!: లాలూకు జడ్జీ కౌంటర్
రాంచీ: దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ సహా దోషులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేయాల్సిన నేపథ్యంలో గురువారం లాలూ కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా కోర్టు గదిలో న్యాయమూర్తికి, లాలూకి మధ్య సరదా సంభాషణ జరిగింది.
'ఇక్కడ(జైలులో) చాలా చలిగా ఉంది' అని.. లాలూ వ్యాఖ్యానించారు. అది విన్న సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి శివ్పాల్సింగ్.. అయితే 'తబలా(సంగీత వాద్యం) వాయించు' అని లాలూకి కౌంటర్ వేశారు. అంతేగాక, లాలూ మనుషుల నుంచి తనకు ఫోన్లు కూడా వస్తున్నాయని న్యాయమూర్తి చెప్పడం గమనార్హం.

కాగా, విచారణ సమయంలో మరోసారి లాలూ తాను న్యాయవిద్యను అభ్యసించానని కూడా చెప్పారు. దాణా కుంభకోణం కేసులో లాలూ, సహా ఇతర దోషులకు జనవరి 3న శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది.
కానీ , బుధవారం న్యాయవాది విందేశ్వర ప్రసాద్ మృతితో తీర్పును గురువారానికి వాయిదా వేశారు. అయితే, మళ్లీ శిక్షల ఖరారు శుక్రవారానికి వాయిదా పడింది. పరిస్థితులను బట్టి నేటి తీర్పుకు లాలూ వీడియో కాన్ఫరెన్స్ లేదా వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉంది.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications