వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

21 రోజుల లాక్‌డౌన్ చివరిరోజు..ప్రధాని ఏం చెబుతారు?: మరి కాస్సేపట్లో వీడనున్న ఉత్కంఠత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌డౌన్ చివరిరోజుకు చేరుకుంది. యావత్ భారతదేశ ప్రజల స్వీయ గృహనిర్బంధం మంగళవారం నాటితో ముగియబోతోంది. ప్రజలు నిర్బంధంలో ఉన్నప్పటికీ.. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గలేదు. ఫలితంగా- ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించుకున్నాయి..తెలంగాణ సహా.

 హాట్‌స్పాట్‌గా హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడుతున్న కరోనా: 1000 పైగా పాజిటివ్ హాట్‌స్పాట్‌గా హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడుతున్న కరోనా: 1000 పైగా పాజిటివ్

ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ఆయన దేశ ప్రజల ముందుకు రానున్నారు. లాక్‌డౌన్‌పై ప్రధాని ఏం చెబుతారు? ఎలాంటి సందేశాన్ని ఇస్తారనే ఉత్కంఠతకు మరి కాస్సేపట్లో తెర పడబోతోంది. లాక్‌డౌన్ కొనసాగించడంపై ఈ నెల 11వ తేదీన ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు.

Last day of Lockdown: Prime Minister Narendra Modi to address to the nation at 10 AM today

లాక్‌డౌన్ పొడిగింపుపై ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భిన్న స్వరాలు వినిపించిన విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాలు పొడిగింపు వైపు మొగ్గు చూపగా.. మరి కొన్ని పాక్షికంగా సడళించడాన్ని ఆశించాయి. రెడ్‌జోన్లు, హాట్‌స్పాట్లకు మాత్రమే పరిమతం చేసేలా లాక్‌డౌన్‌ను పొడిగించాలనే అభిప్రాయాన్ని వెల్లడించాయి. ఈ భేటీ తరువాత ప్రధాని నిర్ణయంలో మార్పు వచ్చిందని తెలుస్తోంది. అందుకే- స్మార్ట్ లాక్‌డౌన్ విధానాన్ని తెర మీదికి తీసుకుని రావచ్చని చెబుతున్నారు.

కరోనా వైరస్ లేని ప్రాంతాల్లో పాక్షికంగా లాక్‌డౌన్‌ను సడలించడం వల్ల కొంతవరకైనా వ్యాపార కార్యకలాపాలు పునఃప్రారంభమౌతాయని, పరిశ్రమలను పునరుద్ధరించడానికి వీలు ఉంటుందని అంటున్నారు. ఫలితంగా- ఆర్థిక వెసలుబాటు ఉండే అవకాశం లేకపోలేదని, దీన్ని దృష్టిలో ఉంచుకునే దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించిన ప్రతిపాదనలను తీసుకొచ్చారనే చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది.

Recommended Video

Coronavirus: Deoband Mosque Now Centre For COVID 19 Spread Like Nizamuddin Markaz

English summary
Prime Minister Narendra Modi is set to address the nation at 10 AM today, as the nation enters the last day of 21-day lockdown period which was earlier announced by the prime minister, to contain the spread of COVID-19. In his address, the prime minister is expected to make major announcements regarding the lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X