Big Breaking : జమిలి ఎన్నికలపై లా కమిషన్ భారీ షాక్-2024లో కష్టమే- కారణమిదే..!
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై తీవ్ర స్ధాయిలో చర్చలు జరుగుతున్న వేళ దీనిపై అధ్యయనం కోసం గతంలో నియమించిన 22వ లా కమిషన్ ఇవాళ తన రిపోర్టును సిద్దం చేసింది. ఇందులో జమిలి ఎన్నికలతో పాటు పోస్కో చట్టం వంటి అంశాలపైనా తమ అభిప్రాయాలు పొందుపరిచింది. ఇందులో ఇప్పట్లో జమిలి ఎన్నికలు సాధ్యం కావని తేల్చిచెప్పేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు జమిలి ఎన్నికలపై తమ అభిప్రాయాలు చెప్పేందుకు సిద్ధమవుతోంది.
2024లో జమిలి ఎన్నికలు జరగవని లా కమిషన్ వర్గాలు ఇవాళ వెల్లడించాయి. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని లా కమిషన్ విశ్వసిస్తోందని తెలిపాయి. జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదికను 2024 లోక్సభ ఎన్నికలకు ముందే వెల్లడించాలని భావిస్తున్నారు. లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్తీ దీనిపై మాట్లాడుతూ.. ఇంకా ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నందున నివేదికకు కొంత సమయం పడుతుందని అన్నారు.

దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని, ఇవి ఇప్పటికిప్పుడు సాధ్యం కావని లా కమిషన్ తన నివేదికలో కేంద్రానికి తెలిపింది. అంతవరకూ విడిగానే లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించింది. డిసెంబర్ 2022లో దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనపై జాతీయ రాజకీయ పార్టీలు, భారత ఎన్నికల సంఘం, బ్యూరోక్రాట్లు, విద్యావేత్తలు, నిపుణులతో సహా భాగస్వాముల అభిప్రాయాన్ని కోరుతూ 22వ లా కమిషన్ ఆరు ప్రశ్నలు రూపొందించింది. ఈ నివేదికను 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రచురించి, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించాలని భావిస్తున్నారు.
-
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్ఫర్డ్లో "ఏఐ" పై ప్రసంగం..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications