లా విద్యార్థి కేసు : స్వామి చిన్మయానంద సంవత్సర కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు...
ఉత్తర ప్రదేశ్ షాజహన్పూర్లోని తన ఇంటి నుంచి వారం రోజుల పాటు తప్పిపోయిన లా విద్యార్ధిని బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ పై అత్యాచారం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే... కేసుపై సిట్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలోనే మరోసారి ఆమే చిన్మయానంద్ తనపై ఒక సంవత్సరం పాటు అత్యాచారం చేస్తూ.. దోపిడీకి పాల్పడ్డాడని ఆమే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోంది. దీంతో డిల్లీ పోలీసులు స్వామి చిన్మయానందపై కేసు నమోదు చేశారు. కాగా అత్యాచారం కేసుకు సంబంధించి యూపీ పోలీసులు నిరాకరించడంతో ఆమే డిల్లీలో పిర్యాధు చేశారు. అనంతరం యూపీలోని షాజహాన్ పూర్ పోలీసులకు కేసును బదిలీ చేశారు.
హెల్త్ అలర్ట్: హైదరాబాదును వణికిస్తున్న డెంగ్యూ...కొత్తగా మరో వైరస్
స్వామి చిన్మయానందపై లైంగిక వేధింపుల ఆరోపణలు
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్కు చెందిన ఈ లా విద్యార్థిని బిజెపి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానందపై లైంగిక వేధింపులు చేసిన విషయం తెలిసిందే. తన ఫేస్బుక్లో ఆరోపణలు చేసిన తర్వాత ఆమే వారం రోజుల పాటు కనిపించకుండా పోయారు. దీంతో ఆమెను చిన్మయానందే కిడ్నాప్ చేయించారని ప్రచారం జరిగింది. కాగా, సంత్ సమాజ్కు చెందిన ఓ పెద్దాయన చాలా మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని, తనను కూడా హత్య చేయడానికి ప్రయత్నించారని న్యాయ విద్యార్ధిని ఆరోపించింది. అంతేగాక, తనను కాపాడాలంటూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోడీని ఆ వీడియోలో కోరింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
న్యాయ విద్యార్ధినిపై కేసు నమోదు
దీంతో చిన్మయానందపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన ఆశ్రమంలో సోదాలు నిర్వహించారు. అక్కడ ఆ యువతి లభించకపోవడంతో ఆమె కోసం గాలింపు చేపట్టారు. చివరకు ఆమెను రాజస్థాన్ రాష్ట్రంలో గుర్తించారు. యువతి క్షేమంగా ఉందని పోలీసులు చెప్పడంతో ఆమెను తమ ముందు హాజరు పర్చాలంటూ సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. రాజస్థాన్ నుంచి పోలీసులు ఆ యువతిని షాజహాన్పూర్ తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. ఇది ఇలావుంటే, ఆ యువతి తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని చిన్మయానంద ఆరోపించారు. రూ. 5కోట్లు డిమాండ్ చేస్తోందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యువతిపై కూడ ఎఫ్ఐఆర్ నమోదైంది.
సిట్ను ఏర్పాటు చేయాలని ఆదేశించిన సుప్రిం కోర్టు
వేధింపుల అంశాన్ని కొంతమంది అడ్వకేట్స్ సుప్రిం కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో సుమోటగా స్వికరించింది. విచారణ అనంతరం కేసుకు సంబంధించి ప్రత్యేక ఇన్విస్టిగేషన్ టీంను (సిట్ ) ను ఐజి ర్యాంకు అధికారితో ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కొద్ది రోజుల క్రితం సుప్రిం కోర్టు ఆదేశించింది. దీంతోపాటు కేసును విచారించేందుకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలని అలహాబాద్ హైకోర్టును సైతం అదేశించింది. కాగా రెండు రోజుల క్రితం సిట్ పోలీసులు సుమారు 11 గంటలపాటు ఆమేను విచారించినట్టు ఆమే తెలిపింది.సిట్ పోలీసులకు కూడ అత్యాచారానికి సంబంధించిన అంశాలను వివరించానని ఆమే తెలిపింది. అయితే చిన్మయా నందపై అత్యచారం కేసు మాత్రం నమోదు చేయలేదని ఆమే మీడియాతో తెలిపింది.