CM: అధికార పార్టీ లీడర్ హత్య, కేసు ఎన్ఐఏ చేతికి, సీఎం సీరియస్, సీన్ రివర్స్, హత్య వెనుక ? ! బెంగళూరు: కర్ణాటకల
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ యువమోర్చ నాయకుడు ప్రవీణ్ హత్య కేసు కలకలం రేపింది. బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసును మేము సాదారణ హత్య కేసుగా బావించడంలేదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. ఇప్పటికే సీఎం బసవరాజ్ బోమ్మయ్ తో పాటు కర్ణాటక హోమ్ మంత్రి, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకుడి హత్య కేసు ఖండించారు. కర్ణాటకను కుదిపేసిన బీజేపీ యువమోర్చ నాయకుడి హత్య కేసులో పోలీసులు ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులు బీజేపీ నాయకుడి హత్యకు స్కెచ్ వేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బీజేపీ నాయకుడి హత్య కేసుతో అనేక మందికి సంబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం అయ్యాయి. ఇదే సమయంలో బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసు ఎన్ఐఏ చేతికి వెళ్లిపోయింది. బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసుకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ క్లారిటీ ఇచ్చారు.

జీర్ణించుకోలేకపోయారు
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని సూళ్య తాలుకాలోని బెళ్లారే పట్టణంలో ప్రవీణ్ నెట్టూరు అలియాస్ ప్రవీణ్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ యువమోర్చ నాయకుడిగా పని చేస్తున్న ప్రవీణ్ బీజేపీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాడని ఓ వర్గం వాళ్లు జీర్ణించుకోలేకపోయారని సమాచారం.

పక్కాప్లాన్ తో హత్య
దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ బెళ్లార పట్టణంలోని బెరువాజీ క్రాస్ లో కోళ్ల అంగడి నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. కేరళ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన బైక్ లో వెళ్లిన ముగ్గురు వ్యక్తులు బీజేపీ నాయకుడు ప్రవీణ్ మీద వేటకొడవళ్లతో దాడి చేశారు. ఆ సందర్బంలో తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకుడు ప్రవీణ్ ను వెంటాడి నరికి చంపేశారు.

సీఎం సీరియస్
కర్ణాటకలో బీజేపీ యువమోర్చ నాయకుడు ప్రవీణ్ హత్య కేసు కలకలం రేపింది. బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసును మేము సాదారణ హత్య కేసుగా బావించడంలేదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. ఇప్పటికే సీఎం బసవరాజ్ బోమ్మయ్ తో పాటు కర్ణాటక హోమ్ మంత్రి, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకుడి హత్య కేసు ఖండించారు.

కర్ణాటకను కుదిపేసింది
కర్ణాటకను కుదిపేసిన బీజేపీ యువమోర్చ నాయకుడి హత్య కేసులో పోలీసులు ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులు బీజేపీ నాయకుడి హత్యకు స్కెచ్ వేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బీజేపీ నాయకుడి హత్య కేసుతో అనేక మందికి సంబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం అయ్యాయి.

ఎన్ఐఏ చేతికి కేసు
ఇదే సమయంలో బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసు ఎన్ఐఏ చేతికి వెళ్లిపోయింది. బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసుకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకుడు ప్రవీణ్ ను హత్య కేసులో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

సంఘవ్యతిరేక శక్తుల పనే ?
బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య వెనుక సంఘ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులతో సంబందాలు ఉన్న వారి ప్రమేయం ఉంది అనుమానంతో ఈ కేసు ఎన్ఐఏకి అప్పగించామని అన్నారు. బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య వెనుక ఎవ్వరు ఉన్నా వదిలిపెట్టమని, అందుకే కేసు ఎన్ఐఏకి అప్పగించామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications