మోడీ ఇంటికి నేతల క్యూ : అటు నుంచే అటే రాష్ట్రపతి భవన్కు ...
న్యూఢిల్లీ : మిగిలింది మరికొన్ని గంటలే .. రాష్ట్రపతి భవన్ వేదికగా రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే మోడీ 2.0 టీంలో చేరబోయే నేతలంతా ఆయనకు కలిసేందుకు క్యూ కడుతున్నారు. వారంతా అటునుంచే బయల్దేరి ప్రమాణ స్వీకారానికి బయల్దేరుతారని తెలుస్తోంది.
4.30 గంటలకు భేటీ
రాత్రి 7 గంటలకు మోడీ ప్రమాణం చేస్తారు. తర్వాత మంత్రుల స్వియరింగ్ ఉంటుంది. మొత్తం 60 మందితో క్యాబినెట్ కొలువుదీరనుంది. ఇప్పటికే ఆయా నేతలకు బీజేపీ చీఫ్ అమిత్ షా, పీఎంవో సమాచారం అందించింది. దీంతో ముఖ్యనేతలంతా ఢిల్లీలో అందుబాటులో ఉన్నారు. ముఖ్యనేతలంతా సాయంత్రం 4.30 గంటలకు మోడీ నివాసానికి చేరుకోనున్నారు. ధర్మేంద్ర ప్రదాన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, సదానందగౌడ, గిరిరాజ్ సింగ్, నితిన్ గడ్కరీ, తమ భాగస్వామ్య పార్టీ ఎల్జేపీ అధినేత రాం విలాస్ పాశ్వాన్, ప్రకాశ్ జవదేకర్, రమేశ్ పొఖ్రియాల్ మోడీతో సమావేశమవుతారు. వీరంతా కలిసి ర్యాలీగా రాష్ట్రపతి భవన్ చేరుకుంటారని తెలుస్తోంది.

అసమ్మతి స్వరం
మోడీ 2.0 టీంలో కొందరు నేతలకు చోటు దక్కే అవకాశం లేదు. సంతోష్ గాంగ్వార్ కు ప్రొటెం స్పీకర్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆయన స్పందించారు. తాను ప్రొటెం స్పీకర్ పదవీ చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే పార్టీ అప్పగించే పనిని మాత్రం చేస్తానని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications