పీఎఫ్ఐ‌తో 873 మంది కేరళ పోలీసులకు సంబంధాలు: ఎన్ఐఏ దాడుల సమాచారం లీక్

తిరువనంతపురం: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో కొందరు కేరళ పోలీసులకు ఉన్న సంబంధాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తాజాగా, సంచలన ప్రకటన చేసింది. కనీసం 873 మంది కేరళ పోలీసు అధికారులకు రాడికల్ సంస్థ పీఎఫ్ఐతో సంబంధాలున్నాయని ఎన్‌ఐఏ వెల్లడించింది.

పీఎఫ్‌ఐతో సంబంధాలున్న కేరళ పోలీసు అధికారుల జాబితాను బట్టబయలు చేస్తూ ఎన్‌ఐఎ మంగళవారం రాష్ట్ర పోలీసు చీఫ్‌కు నివేదిక సమర్పించింది.
ఆ నివేదికల ప్రకారం .. సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ), స్టేషన్ హెడ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్ఓ) ర్యాంక్‌లోని అధికారులతో సహా కేరళ పోలీసు అధికారులను సెంట్రల్ ఏజెన్సీ విచారిస్తోంది. అధికారుల ఆర్థిక వివరాలను కూడా ఎన్ఐఏ పరిశీలిస్తోంది.

ఈ అధికారులు తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు పీఎఫ్‌ఐ క్యాడర్‌లకు కీలక సమాచారాన్ని లీక్ చేశారని ఎన్‌ఐఎ పేర్కొంది. ఈ దాడుల్లో పీఎఫ్‌ఐ జిహాదీలకు అధికారులు సహకరించారని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. వారు ఎన్ఐఏ, ఈడీ దాడుల గురించి పీఎఫ్ఐ క్యాడర్‌లకు ముందే సమాచారం అందించారని పేర్కొంది. ఇది నేరారోపణ పత్రాలు, సామగ్రిని దాచడానికి వారికి సహాయపడిందని తెలిపింది.

leaking raid information to PFI cadres: NIA reveals 873 Kerala Police officers have links to banned outfit PFI

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు స్పాన్సర్‌ చేస్తున్నారనే ఆరోపణలతో పీఎఫ్ఐ సంస్థపై రెండు దఫాలుగా సోదాలు నిర్వహించింది ఎన్ఐఏ. సెప్టెంబరు 22న మొదటిసారి దాడులు జరిగాయి. సెప్టెంబర్ 27న పలు రాష్ట్రాల్లో తదుపరి దాడులు జరిగాయి. ఫలితంగా పీఎఫ్ఐతో సంబంధం ఉన్న కనీసం 250 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 28న కేంద్ర ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ), దాని అనుబంధ సంస్థలను 5 ఏళ్లపాటు నిషేధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద సంస్థలు చట్టవిరుద్ధమైన సంఘాలుగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది.

పీఎఫ్ఐతో పాటు నిషేధించబడిన అనుబంధాలలో ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ), రిహాబ్ ఇండియా ఫౌండేషన్, నేషనల్ కాన్ఫ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గ్, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిహాబ్ ఫౌండేషన్, కేరళ ఉన్నాయి. ఎన్‌ఐఏ అధికారులు జరిపిన దాడుల్లో దేశంలోని దాదాపు 17 రాష్ట్రాల్లోని పీఎఫ్‌ఐ హబ్‌ల నుంచి అనేక నేరారోపణల మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ప్రముఖమైనవి 'మిషన్ 2047'కి సంబంధించిన బ్రోచర్, సీడీ.

కర్నాటక, కేరళ, తమిళనాడులోని పీఎఫ్ఐ జిహాదీ రహస్య స్థావరాల నుంచి భారీ మొత్తంలో నమోదుకానీ నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. 'సులభంగా లభించే పదార్థాలను ఉపయోగించి ఐఈడీలను ఎలా తయారు చేయాలనే దానిపై ఒక చిన్న కోర్సు'లో డాక్యుమెంట్ చేయబడింది. కాగా, ఉత్తరప్రదేశ్ పీఎఫ్ఐ నాయకత్వం నుంచి ఐఎస్ఐఎస్, గజ్వా-ఎ-హింద్‌కు సంబంధించిన వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్‌లు, తమిళనాడు పీఎఫ్ఐ నాయకత్వం నుంచి మెరైన్ రేడియో సెట్‌లు గుర్తించారు. వైర్‌లెస్ కమ్యూనికేషన్ పరికరాలతో సహా అనేక ఇతర సామగ్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+