మిగిలింది మూడురోజులే : స్పీడ్ పెంచిన పార్టీలు.. ఏప్రిల్ 7 ఉదయం నుంచి సాయంత్రి వరకు రాజకీయ పరిణామాలు
పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారం ఉద్ధృతం చేశారు. లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయపార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఉగాది కారణంగా ప్రచారానికి విరామమిచ్చిన జగన్ క్యాంపెయినింగ్లో జోరు పెంచారు. మరోవైపు అనారోగ్యం కారణంగా రెండు రోజులుగా ప్రచారానికి దూరమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ప్రచార రంగంలో దూకుడు పెంచనున్నారు. తెలంగాణలో 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా కారు దూసుకుపోతోంది. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీలు ప్రచారంలో జోరు పెంచారు.













Click it and Unblock the Notifications