ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రధాని మోడీ ప్రసంగం | Narendra Modi Address To The Nation On Article 370
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన తర్వాత దేశంను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించారు ప్రధాని మోడీ. మొత్తం 38 నిమిషాల పాటు మోడీ ప్రసంగం సాగింది. జమ్మూ కశ్మీర్కు విముక్తి కల్పించినట్లు ప్రధాని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో ఇకపై జమ్మూ కశ్మీర్ అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. జమ్మూ కశ్మీర్ తాత్కాలికంగా మాత్రమే కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుందని అది శాశ్వతం కాదని మోడీ పునరుద్ఘాటించారు. జమ్మూ కశ్మీర్లో ఈద్ వేడుకలు యథావిధిగా కొనసాగుతాయన్న ప్రధాని అక్కడి ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్టికల్ 370తో జమ్మూ కశ్మీర్లో అభివృద్ధి కుంటున పడిందని ఇకపై పరుగులు పెడుతుందని చెప్పారు. జమ్మూ కశ్మీర్కు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రధాని మోడీ... ప్రజలు ఇకపై వారికి నచ్చిన ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారని చెప్పారు. జమ్మూ కశ్మీర్లో యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని ఆ రాష్ట్రాన్ని టూరిజం హబ్గా తయారు చేస్తామని చెప్పారు. ఇకపై కశ్మీర్లో సుపరిపాలన ఉంటుందని చెప్పారు ప్రధాని. ఇక జమ్మూ కశ్మీర్లో విధుల్లో ఉంటూ దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసులకు జవాన్లకు సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. అమరులైన జవాన్లు స్వప్నాన్ని నిజం చేసేందుకు పనిచేయాల్సిందిగా మోడీ పిలుపునిచ్చారు.
Aug 08, 2019, 8:39 pm IST
38 నిమిషాల పాటు ప్రసంగించిన మోడీ
Aug 08, 2019, 8:39 pm IST
జమ్మూ కశ్మీర్ ప్రజలకు దేశభక్తి చాలా ఉంది: మోడీ
Aug 08, 2019, 8:38 pm IST
అమరులు కన్న కలలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది: మోడీ
Aug 08, 2019, 8:38 pm IST
విధుల్లో ఉండగా దేశంకోసం అమరులైన పోలీసులకు సెల్యూట్ చేస్తున్నాను: మోడీ
Aug 08, 2019, 8:37 pm IST
కశ్మీర్ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
Aug 08, 2019, 8:37 pm IST
ఈద్ వేడుకలు యథావిధిగా కొనసాగుతాయి:మోడీ
Aug 08, 2019, 8:36 pm IST
భద్రతాదళాలకు సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పిన ప్రధాని మోడీ
Aug 08, 2019, 8:36 pm IST
ఆర్టికల్ 370 ఉగ్రవాదానికి పురుడు పోసింది: మోడీ
Aug 08, 2019, 8:35 pm IST
పాకిస్తాన్ గీసిన రూపురేఖలను జమ్మూ కశ్మీర్ తిరగరాస్తుంది: మోడీ
Aug 08, 2019, 8:33 pm IST
జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఉద్యోగాలు, పర్యాటకాభివృద్ధి చేస్తామని ప్రధాని మోడీ హామీ
Aug 08, 2019, 8:32 pm IST
జమ్మూ కశ్మీర్ ప్రజల యోక్క సాధకబాధకాలను పాలుపంచుకుంటాం: మోడీ
Aug 08, 2019, 8:31 pm IST
జమ్మూ కశ్మీర్పై కొందరు వ్యతిరేకంగా గళం విప్పారు. వారి అభిప్రాయాలను కూడా గౌరవిస్తాను: మోడీ
Aug 08, 2019, 8:30 pm IST
లడఖ్కు మంచి సదుపాయాలు కల్పిస్తాం: మోడీ
Aug 08, 2019, 8:30 pm IST
టూరిస్ట్ హబ్లలో లడాఖ్ అగ్రస్థానంలో నిలిచే సామర్థ్యం ఉంది: మోడీ
Aug 08, 2019, 8:30 pm IST
స్థానిక ఆహార ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లను శాసించాలి: మోడీ
Aug 08, 2019, 8:29 pm IST
జమ్మూ కశ్మీర్ను పర్యాటక రాజధానిగా తీర్చిదిద్దుకుందాం: మోడీ
Aug 08, 2019, 8:29 pm IST
ఆర్టికల్ 370 నుంచి కశ్మీర్కు విముక్తి కల్పించాం: మోడీ
Aug 08, 2019, 8:24 pm IST
కేంద్రపాలిత ప్రాంతం తాత్కాలికం మాత్రమే: మోడీ
Aug 08, 2019, 8:22 pm IST
పంచాయతీలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నాయి: మోడీ
Aug 08, 2019, 8:22 pm IST
జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం: మోడీ
PM Modi will be addressing the nation on Thursday days after the abogation of Article 370 and bifurcation of Jammu Kashmir bill that was passed in Parliament a couple of days ago. Nation is watching with Keen interest as what Modi is going to speak about on POK.