నెస్లే సెర్లాక్లో పురుగులు, ఫంగస్: మదర్ డైరీలో..
చెన్నై: మ్యాగీలో సీసం శాతం అధికంగా ఉందన్న వార్తలతో కష్టాల్లో కూరుకుపోయిన నెస్లేకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. చిన్న పిల్లలకు తినిపించే సెర్లాక్లో పురుగులు, ఫంగస్ ఉన్నట్లు తమిళనాడులో గుర్తించారు. దీంతో సెర్లాక్ నమూనాలను పరీక్షలకు పంపించారు.
వారం రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని కోయంబత్తూరులో నివాసముంటున్న శ్రీరాం అనే వ్యక్తి తమ పాపాయి కోసం సెర్లాక్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు.

అందులో పురుగులు, ఫంగస్ ఉండడమే, కాకుండా, అది తయారైంది ‘2016 సంవత్సరం' అని ఆ డబ్బాపై ముద్రించి ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది.
మదర్ డైరీ మిల్క్లో డిటర్జెంట్
ఇది ఇలా ఉండగా, పశ్చిమబెంగాల్కు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ తయారు చేస్తున్న ఓ పాల ప్యాకేట్లో సర్ఫ్ ఉన్నట్లు తేలింది. అగ్రాలో ఎఫ్డిఏ(ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) రాంనరేష్ యాదవ్.. మదర్ డైరీ నుంచి సేకరించిన రెండు పాల ప్యాకేట్లను పరిశీలించగా.. అందులో ఒకదానిలో సర్ఫ్, బట్టల సబ్బుకు సంబంధించిన పదార్థాలు బయటపడ్డాయి. అయితే ఇది అనుకోకుండా జరిగిందని మదర్ డైరీ అధికారులు చెబుతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications