జీతాలు నిలిపివేయండి: అద్వానీకి కోపమొచ్చింది
భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ (ఎల్కే అద్వానీ)కి కోపం వచ్చింది. పార్లమెంటులో సమావేశాలను అడ్డుకోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం బీజేపీ పార్లమెంటరీ భేటీ జరిగింది.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ (ఎల్కే అద్వానీ)కి కోపం వచ్చింది. పార్లమెంటులో సమావేశాలను అడ్డుకోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం బీజేపీ పార్లమెంటరీ భేటీ జరిగింది.
ఈ భేటీలో అద్వానీ పలు సూచనలు చేశారు. సభను అడ్డుకునే వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో ఆలోచించాలన్నారు. లేకుంటే సభలో చర్చ జరిగేందుకు అవకాశాలను పరిశీలించాలన్నారు. సభను అడ్డుకునే వారిపై స్పీకర్ కఠిన నిర్ణయం తీసుకోవాలన్నారు.

సభకు అడ్డుపడుతున్న సభ్యుల జీతాలు నిలిపివేసేలా చర్యలను స్పీకర్ పరిశీలించాలని కోరారు.
నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విపక్షాలు ఆరోపిస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న నేపథ్యంలో బుధవారం ఉదయం ప్రధాని మోడీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించారు.












Click it and Unblock the Notifications