రాఖీ, జగన్..: గొంతు చించుకుంటున్నారు! (పిక్చర్స్)
హైదరాబాద్/బెంగళూరు/న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆయా పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీకి ఓట్లు వేస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మొదటిసారి సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మొదటిసారి లోకసభ ఎన్నికలను ఎదుర్కొంటోంది. వాయువ్య ముంబై నుండి బరిలోకి దిగుతున్న రాఖీ సావంత్ ప్రజల వద్దకు వెళ్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో లోకసభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి.

రాఖీ సావంత్
రాష్ట్రీయ ఆమ్ పార్టీ నేత రాఖీ సావంత్ ముంబైలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆమె వాయివ్య ముంబై నుండి పోటీ చేస్తున్నారు. బాలీవుడ్ ఐటం గర్ల్ అయిన రాఖీ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

జయలలిత
అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోయంబత్తూరులో బుధవారం పర్యటించి ప్రచారం చేశారు. తమ పార్టీకి ఓటేయాలని కోరారు.

నితీష్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) ముఖ్యనేత బీహార్ రాష్ట్రంలోని గంజ్ విక్రమ్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన విపక్షాలపై నిప్పులు చెరిగారు.

నరేంద్ర మోడీ
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బుధవారం జార్ఖండ్లోని కోడెర్మలో ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే పాలించనని, దేశానికి సేవ చేస్తానని చెప్పారు.

లాలూ ప్రసాద్ యాదవ్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న దృశ్యం. సభలకు ప్రజల నుండి మంచి మద్దతు వస్తోంది.

వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా సీమాంధ్ర పైన దృష్టి సారించారు. ఆయన విజయనగరం జిల్లాలో ప్రచారం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications