Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Sabha Election 2024 Phase 5 Polling LIVE : 57 శాతం ఓటింగ్, రాయ్‌బరేలీలో రాహుల్ భవితవ్యం ఏంటి..?

లోక్‌సభ ఎన్నికలు 2024 5వ విడత పోలింగ్ ప్రత్యక్ష ప్రసారాలు:లోక్‌సభ ఎన్నికలకు ఐదవ దశ ఓటింగ్ మే 20న ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో జరగనుంది.సోమవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.ఐదో దశ సార్వత్రిక ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లోని 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్‌లో 7, బీహార్‌లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్‌లో 3, జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్‌లో ఒక్కొక్కటి చొప్పున నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

ఐదవ దశ లోక్‌సభ ఎన్నికలలో రాయ్‌బరేలీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌కు చెందిన రాహుల్‌గాంధీ కీలక అభ్యర్థుల్లో ఒకరుగా ఉన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేథీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. లక్నో నుండి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కైసర్‌గంజ్ నుండి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్, RJD నాయకుడు మరియు పార్టీ అధినేత మరియు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కుమార్తె,శరన్ నుండి రోహిణి ఆచార్య,హాజీపూర్ నుండి చిరాగ్ పాశ్వాన్, ముంబై నార్త్ నుండి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్,మరియు బారాముల్లా నుండి నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బరిలో ఉన్నారు. ఇక ఐదవ దశ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మినిట్ టు మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Lok Sabha Election 2024 phase 5 polling live updates news telugu check all states constituencies coverage

May 20, 2024, 9:44 pm IST

లోక్‌సభ ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 57.47 శాతం పోలింగ్ జరిగింది.
May 20, 2024, 7:03 pm IST

పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎం, వీవీ ప్యాట్లను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్న ఎన్నికల సిబ్బంది.
May 20, 2024, 6:47 pm IST

పోలింగ్ అనంతరం ఈవీఎం, వీవీప్యాట్ లకు సీల్ వేస్తున్న ఎన్నికల అధికారులు.
May 20, 2024, 6:44 pm IST

ఐదో విడతలో పశ్చిమబెంగాల్‌లో 73 శాతం పోలింగ్ నమోదైంది.
May 20, 2024, 6:05 pm IST

సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.
May 20, 2024, 6:04 pm IST

దేశంలో ఐదో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
May 20, 2024, 5:46 pm IST

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు చాలా కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని ఉద్ధవ్ థాకరే ఆరోపించారు.
May 20, 2024, 5:25 pm IST

ముంబైలో మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు 40 శాతం ఓటింగ్ నమోదైంది.
May 20, 2024, 2:40 pm IST
ఢిల్లీ

మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40.38 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించిన ఈసీ.
May 20, 2024, 2:38 pm IST
మహారాష్ట్ర

ముంబైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ నటులు గుల్షన్ గ్రోవర్, భూమి పెడ్నేకర్.
May 20, 2024, 2:35 pm IST
మహారాష్ట్ర

పోలింగ్ బూత్‌ కంపార్ట్‌మెంట్‌కు పూలమాల వేసిన నాసిక్ ఇండిపెండెంట్ అభ్యర్థి శాంతిగిరి మహరాజ్. దీనిపై ఎన్నికల సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.
May 20, 2024, 2:32 pm IST
మహారాష్ట్ర

ముంబైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ నటుడు అమీర్ ఖాన్, కిరణ్ రావు
May 20, 2024, 1:36 pm IST
మహారాష్ట్ర

ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ నటుడు హృతిక్ రోషన్
May 20, 2024, 1:24 pm IST
ఉత్తర్ ప్రదేశ్

ఓటు వేయడానికి రాయ్‌బరేలీ పోలింగ్ బూత్‌కు చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ.
May 20, 2024, 12:48 pm IST
మహారాష్ట్ర

ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్
May 20, 2024, 12:44 pm IST
మహారాష్ట్ర

ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మి.
May 20, 2024, 12:32 pm IST
మహారాష్ట్ర

ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ దంపతులు.
May 20, 2024, 12:14 pm IST
ఉత్తర్ ప్రదేశ్

తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందు రాయ్‌బరేలీలోని పీపలేశ్వర్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహంచిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు.
May 20, 2024, 12:12 pm IST
మహారాష్ట్ర

ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ నటుడు అనిల్ కపూర్.
May 20, 2024, 11:59 am IST
ఢిల్లీ

ఉదయం 11 గంటల వరకు 23.66 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించిన ఈసీ. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 32.70, అత్యల్పంగా మహారాష్ట్రలో 15.93 శాతం పోలింగ్ నమోదు.
May 20, 2024, 11:31 am IST

సోమవారం ఐదో దశలో పశ్చిమ బెంగాల్‌లోని ఏడు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
May 20, 2024, 11:25 am IST

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం ఒడిశాలోని పూరీలో పూరీ బీజేపీ అభ్యర్థితో కలిసి రోడ్‌షో నిర్వహించారు.
May 20, 2024, 11:18 am IST

కోడెర్మాలో కేంద్ర రాష్ట్ర మంత్రి అన్నపూర్ణా దేవి ఓటు వేశారు.
May 20, 2024, 11:04 am IST

గాయకుడు కైలాష్ ఖేర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
May 20, 2024, 10:51 am IST

నటి, ఎంపీ హేమ మాలిని, ఆమె కుమార్తె నటి ఈషా డియోల్ ముంబైలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
May 20, 2024, 10:39 am IST

రక్షణ మంత్రి, లక్నో లోక్‌సభ బీజేపీ అభ్యర్థి, రాజ్‌నాథ్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
May 20, 2024, 10:24 am IST

2024 లోక్‌సభ ఎన్నికల ఐదవ దశలో ఉదయం 9 గంటల వరకు మహారాష్ట్రలో సగటున 6.33 శాతం ఓటింగ్ నమోదైంది.
May 20, 2024, 10:19 am IST

ఒడిశాలో ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు, 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం జరుగుతోన్న పోలింగ్‌లో తొలి రెండు గంటల్లోనే 6.99 శాతం ఓటింగ్‌ నమోదైంది.
May 20, 2024, 10:08 am IST
మహారాష్ట్ర

ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.
May 20, 2024, 10:07 am IST
ఢిల్లీ

ఉదయం 9 గంటల వరకు 10.37 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించిన ఈసీ
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+