మోదీ.. కాషాయరంగు డ్రెస్ కోడ్
Lok Sabha election 2024 phase 3 Voting: మూడో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 93 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా స్థానాల పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు.
ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. కిందటి నెల 19వ తేదీన 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. 26వ తేదీన 13 రాష్ట్రాల్లో 88 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మొత్తంగా 190 సీట్లల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మూడో విడతలో కర్ణాటక, అస్సాం, బిహార్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ దామన్, గోవా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లల్లో పోలింగ్ కొనసాగుతోంది.
గుజరాత్లో గల లోక్సభ 25 లోక్సభ స్థానాలకూ పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ మొత్తం 26 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా.. 25 సీట్లకు పోలింగ్ నిర్వహిస్తోన్నారు. సూరత్ స్థానం ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి వేసిన నామినేషన్ను తిరస్కరణకు గురైంది. ఫలితంగా- సూరత్ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లోక్సభ పరిధిలో వారిద్దరికీ ఓటు హక్కు ఉంది. అహ్మదాబాద్ సిటీలోని నిషాన్ హై సెకెండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కొద్దిసేపటి కిందటే వారు ఓటు వేశారు.
ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా హస్ముఖ్ సోమాభాయ్ పటేల్ పోటీలో ఉన్నారు. బీజేపీ కంచుకోట గాంధీనగర్ నుంచి అమిత్ షాలో ఉన్న విషయం తెలిసిందే. ఓటు వేసిన అనంతరం మోదీ, అమి్త్ షా వేర్వేరుగా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లనున్నారు. అక్కడ నాలుగో విడత ఎన్నికల ప్రచారంలో వాళ్లు పాల్గొనాల్సి ఉంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications