కిలాడీ స్టార్ హీరోయిన్.. రూ. కోట్లు ధోకా: లుకౌట్ నోటీస్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై ముంబై పోలీసులు లుకౌట్ సర్కులర్ జారీ చేశారు. 60 కోట్ల రూపాయల ఆర్థిక మోసానికి సంబంధించిన కేసులో ఈ నిర్ణయం తీసుకున్నారు. మూతపడ్డ బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడి డీల్ పేరుతో ఓ వ్యాపారవేత్తను మోసం చేసినట్లు ఆరోపణలు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఉన్నాయి. ఈ కేసులో ఎకనామికల్ అఫెన్స్ వింగ్ అడుగు పెట్టింది. ముంబై పోలీసులతో కలిసి విచారణ చేపట్టింది.
దేశం విడిచి పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ముంబై పోలీసులు ముందు జాగ్రత్తచర్యగా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఈ లుక్ అవుట్ నోటీస్ జారీ చేసినట్లు చెబుతున్నారు. వారిద్దరి ప్రయాణాలపై నిఘా వేశారు. వారి రోజువారీ షెడ్యూల్ ను నిశితంగా పరిశీలిస్తోన్నారు. బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆడిటర్ను కూడా విచారణ నిమిత్తం పిలిపించారు. దీంతో ఈ కేసు మరింత జటిలంగా మారింది. వారిని అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు.

దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఫిర్యాదుదారు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు, ఆరోపణల ప్రకారం.. 2015 నుండి 2023 మధ్య కాలంలో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా 60 కోట్ల రూపాయలను తీసుకున్నారు. బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యకలాపాలను విస్తరించబోతోన్నామని, వ్యాపార భాగస్వామి కావడం వల్ల అందులో వాటాలు ఇస్తామని నమ్మబలికారు. ఈ మొత్తాన్ని కూడా తమ సొంత ఇతర వ్యాపారాలు, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించినట్లు కొఠారి పేర్కొన్నారు.
కొఠారి.. లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్. రాజేష్ ఆర్య అనే వ్యక్తి తనను శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాకు పరిచయం చేశాడని, ఆ సమయంలో వారు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్, ఆన్లైన్ రిటైల్ ప్లాట్ఫామ్కు డైరెక్టర్లుగా ఉన్నారని, అందులో 87.6 శాతం కలిగి వాటాలు ఉన్నట్లు
ఈ డబ్బును మొదట రుణంలా తీసుకున్నప్పటికీ.. ఆ తర్వాత మాటమార్చారని, ట్యాక్స్ సేవింగ్స్ లో పెట్టుబడిగా చూపారని దీపక్ కొఠారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇచ్చిన 60 కోట్ల రూపాయలను మొత్తాన్ని 12 శాతం వార్షిక వడ్డీతో కలిపి నిర్ణీత సమయంలో తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారని కొఠారి చెప్పారు. 2016 ఏప్రిల్లో శిల్పాశెట్టి స్వయంగా రాతపూర్వక హామీ ఇచ్చారని కొఠారి పేర్కొన్నారు. ఇప్పటివరకు కూడా దీని గురించి ఊసే ఎత్తట్లేదని తన ఫిర్యాదులో పొందుపరిచారు.
కొన్ని నెలల్లోనే శిల్పాశెట్టి బెస్ట్ డీల్ కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఆ కంపెనీ అప్పటికే దివాలా తీసిందని, దానిపై 1.28 కోట్ల రూపాయల కేసు సైతం నడుస్తోందనే విషయం తనకు తెలియవచ్చిందని కొఠారి వివరించారు. దీన్ని దాచిపెట్టి 60 కోట్ల రూపాయలను తీసుకున్నారని తెలిపారు. కాగా- ఈ ఆరోపణలను శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా ఇదివరకే ఖండించారు. ఇది తమను అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశించిన నిరాధారమైన, దురుద్దేశపూరితమైన కేసు అని పేర్కొన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications