ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య
న్యూఢిల్లీ: ప్రియుడి వ్యామోహంలో కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఒడిషా లోని సుందర్ ఘడ్ ప్రాంతానికి చెందిన అర్జున్ ఇక్కా (26), ఆమె ప్రియురాలు సుమిత్ర (30) అనే ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2009లో ఒడిషా నుండి సుమిత్ర ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్లింది. తరువాత ఢిల్లీకి చెందిన బాబులాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇద్దరు ఢిల్లీలోనే నివాసం ఉంటున్నారు.
అంతకు ముందు సుమిత్ర, అర్జున్ ఇక్కాల మద్య సంబంధం ఉంది. తరువాత అర్జున్ ఢిల్లీ చేరుకుని సెక్యూరిటి గార్డుగా పని చేస్తున్నాడు. అర్జున్ సిక్కా బాబులాల్ ఇంటిలోనే ఉంటున్నాడు. బాబులాల్ లేని సమయంలో సుమిత్ర, అర్జున్ రాసలీలలు సాగించేవారు.
ఒక సారి ఈ విషయం బాబులాల్ కంటపడటంతో ఇద్దరిని గట్టిగా హెచ్చరించాడు. తరువాత అర్జున్ ను ఇంటి నుండి బయటకు పంపించాడు. బాబులాల్ బ్రతికి ఉంటే కష్టం అవుతుందని అర్జున్ తన ప్రియురాలు సుమిత్రకు చెప్పాడు.
తన భర్తను చంపేద్దామని సుమిత్రం తన ప్రియుడు అర్జున్కు చెప్పింది. ఇద్దరు కలిసి అర్జున్ ను హత్య చెయ్యడానికి ప్లాన్ వేశారు. జూన్ 19వ తేదిన రాత్రి బాబులాల్ నిద్రపోతున్న సమయంలో సుమిత్ర ప్రియుడికి సమాచారం ఇచ్చింది. అతను ఇంటికి వచ్చిన తరువాత కొడవలి తీసుకుని బాబులాల్ గొంతు కోసి దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు.