వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరువు హత్య?: అనుమానాస్పద స్థితిలో ప్రేమజంట మృతి

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని నైన్వా ప్రాంతంలో ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఖాన్‌పోల్ ప్రాంతానికి చెందిన గీతా సైనీ(16), సోను బర్హత్(18) ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆదివారం వారిద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

కాలనీలోని ఓ రైతు గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు వీరు వేలాడుతూ కనిపించడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పరిశీలించగా, సోను జేబులో ఓ లేఖ దొరికినట్లు పోలీసులు తెలిపారు.

ఆ లేఖలో వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని మాత్రమే రాసి ఉందని, ఆత్మహత్యకు సంబంధించిన కారణాలేవీ తెలపలేదని చెప్పారు. కాగా, ఇది ఆత్మహత్య కాదని, పరువు హత్య అని మృతుడి మిత్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Lovers commit suicide in Rajasthan

తీవ్రవాదుల దాడి: 8 మంది భద్రత సిబ్బంది కాల్చివేత

కోహిమా: నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో ఆదివారం తీవ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఎనిమిది మంది భద్రత సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఏడుగురు అసోం రైఫిల్స్‌కు చెందినవారు కాగా, ఒకరు టెరిటోరియల్‌ ఆర్మీ జవాను.

తాగునీటిని తెచ్చుకోవడం కోసం ఛంగ్లాన్సు అనే గ్రామానికి వారు ట్యాంకరుతో పాటు వెళ్లారు. ఆ సమయంలో తీవ్రవాదులు చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఎదురుదాడిలో ఒక తీవ్రవాది ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు.

English summary
A teenage girl and her 18-year-old lover today allegedly committed suicide by hanging themselves from a ceiling fan in Nainwa police station area of the district here, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X