బీజేపీ మా రక్తంలో ఉంది: సొంతగూటికి గాలి జనార్ధన్ రెడ్డి, రేపే పార్టీ విలీనం
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత గూటికి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడారు. సోమవారం మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నేతల సమక్షంలో పార్టీలోకి చేరనున్నట్టు గాలి తెలిపారు. బీజేపీ తమ రక్తంలో ఉందన్నారు. ఇప్పుడు సొంత పార్(BJP)టీలోకి తిరిగి వస్తున్నట్లు చెప్పారు.
అయితే ఒకానొక సమయంలో బీజేపీకి బయట నుంచి మద్దతు ఇచ్చే ప్రశ్న తలెత్తిందని, కానీ తన పార్టీ కార్యకర్తలు విలీనానికి ఓటు వేశారని గాలి జనార్థన్ రెడ్డి చెప్పారు. అంతేగాక, బీజేపీ తమ రక్తంలోనే ఉందని గాలి చెప్పుకొచ్చారు. మళ్లీ నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేందుకు తాను మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ పార్టీలో చేరి సాధరణ కార్యకర్తగా పని చేస్తానని చెప్పుకొచ్చారు.

కాగా, 2022లోనే జనార్దన్ రెడ్డి స్థాపించిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేర్పీపీ)ని బీజేపీలో విలీనం చేయడానికి, పార్టీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. జనార్దన్ రెడ్డితో పాటు కేర్పీపీ నేతలంతా బీజేపీ కండువా కప్పుకోనున్నారు. పార్టీ విలీన విషయమై జనార్దన్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు.
తాజాగా, తన పార్టీ మద్దతుదారులతో, కేర్పీపీ భవిష్యత్తుపై సుదీర్ఘంగా చర్చించారు గాలి జనార్ధన్ రెడ్డి. అనంతరం పార్టీని బీజేపీలో విలీనం చేయాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశం అనంతరం జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీలో చేరాలని బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. సోమవారం విజయేంద్ర సమక్షంలో బీజేపీలో చేరబోతున్నాను. చిత్రదుర్గ, గుల్బర్గా, కొప్పల్, రాయచూర్, బళ్లారి, విజయనగరం నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు నా నిర్ణయానికి మద్దతు తెలిపారు. బీజేపీలో పార్టీని విలీనం చేసేందుకు అందరూ అంగీకరించారు అని గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.
అయితే, ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటు కాంగ్రెస్కు వేశారు జనార్దన్ రెడ్డి. కాగా, అది తన మనస్సాక్షి ఓటని తాజాగా సమర్థించుకున్నారు. ఇక మాజీ మంత్రి శ్రీరాములుతో తనకు విభేదాలేం లేవని చెప్పారు. ఆయన్ను చిన్నప్పటి నుంచి తాను పెంచినట్లు తెలిపారు. బళ్లారి లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములుకు మద్దతిస్తానని చెప్పారు. కాగా, బీఎస్ యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, గనుల అక్రమ తవ్వకాల నేపథ్యంలో గాలి జైలుకు వెళ్లారు. తర్వాత బీజేపీకి దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications