సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్, గాడ్సే దేవుడంటూ, రికార్డుల నుంచి తొలగింపు
బీజేపీ వివాదాస్పద ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరోసారి కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. గతంలో తాను చేసిన నాథురాం గాడ్సే వ్యాఖ్యలను ఉద్ఘాటించారు. బుధవారం లోక్సభలో ఎస్పీజీ చట్టసవరణపై చర్చ జరిగే సమయంలో డీఎంకే ఎంపీ రాజా మాట్లాడుతున్నారు. గాంధీని ఎందుకు చంపాననే దానిపై గాడ్సే చేసిన ప్రకటనను ఉదహరించారు. ఇంతలో రాజా ప్రసంగానికి ప్రజ్ఞాసింగ్ అడ్డుతగిలారు. దేశభక్తి గురించి సలహాలు ఇవ్వకండి అంటూ వ్యాఖ్యానించారు.
ఇదివరకు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడిగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు తీవ్రంగా ప్రతిఘటించాయి కూడా. ఇవాళ మరోసారి అదేవిధంగా కామెంట్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. బీజేపీ సభ్యులు కూడా ప్రజ్ఞాసింగ్ తన స్థానంలో కూర్చొవాలని సూచించారు. సభలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.

విపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకతతో బీజేపీ ఎంపీలు కూడా ప్రజ్ఞాసింగ్కు మద్దతు తెలియజేయలేదు. దీంతో గతంలో ఒకసారి క్షమాపణలు కూడా తెలియజేశారు. దీనిపై సభలో రాజా స్పందించారు. గాంధీపై 32 ఎళ్లుగా కోపం పెంచుకున్నానని.. అందుకే చంపానని గాడ్సే ఒప్పుకున్నాడని తెలిపారు. భద్రత అనేది రాజకీయ కారణాలతో కాదని.. వారికి ఉన్న బెదిరింపులను బట్టి కల్పించాల్సి ఉంటుందని చెప్పారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications