వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరుగురు కుటుంబ సభ్యులను నరికి చంపాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Lucknow: man kills six members of his family
లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యంత హృదయవిదాకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన కుటుంబ సభ్యులని కూడా చూడకుండా ఓ వ్యక్తి ఆరుగురిని నరికి చంపాడు. ఆస్తిదాహంతో అతను ఈ కిరాతక చర్యకు ఒడిగట్టాడు. ఆస్తి తగాదాలో అతను ఆరుగురు కుటుంబ సభ్యులను హత్య చేశాడు. శుక్రవారంనాడు పోలీసులు ఈ విషయం చెప్పారు.

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులందేశ్వర్ జిల్లాలోని పిల్కానా గ్రామంలో గత రాత్రి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన తండ్రిని, తన సోదరుడిని, సోదరుడి భార్యను, వారిద్దరి పిల్లలను, మరో వ్యక్తిని నరికి చంపాడు. వారంతా అక్కడికక్కడే మరణించారు

ఇళ్లంతా రక్తంతో తడిసిపోయింది. మృతుల దేహాలపై పలు గాయాలున్నాయి. ఇటుక బట్టీలకు సంబంధించిన తగాదా కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు మీరట్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆలోక్ శర్మ చెప్పారు.

అత్యంత దారుణమైన ఈ సంఘటన గ్రామంలో తీవ్ర సంచలనం సృష్టించింది. తీవ్ర కలకలం చెలరేగింది.

English summary
A man slaughtered six members of his family in Bulandshahr in Uttar Pradesh over a property dispute, police said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X