ఆరుగురు కుటుంబ సభ్యులను నరికి చంపాడు

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని బులందేశ్వర్ జిల్లాలోని పిల్కానా గ్రామంలో గత రాత్రి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన తండ్రిని, తన సోదరుడిని, సోదరుడి భార్యను, వారిద్దరి పిల్లలను, మరో వ్యక్తిని నరికి చంపాడు. వారంతా అక్కడికక్కడే మరణించారు
ఇళ్లంతా రక్తంతో తడిసిపోయింది. మృతుల దేహాలపై పలు గాయాలున్నాయి. ఇటుక బట్టీలకు సంబంధించిన తగాదా కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు మీరట్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ఆలోక్ శర్మ చెప్పారు.
అత్యంత దారుణమైన ఈ సంఘటన గ్రామంలో తీవ్ర సంచలనం సృష్టించింది. తీవ్ర కలకలం చెలరేగింది.












Click it and Unblock the Notifications