14 ఏళ్ల బాలికపై 8 నెలలుగా ఘోరం-స్నేహితులతో కలిసి కజిన్ గ్యాంగ్ రేప్-గర్భం దాల్చడంతో అబార్షన్
ఆ బాలిక వయసు 14 ఏళ్లు... తల్లి మూడేళ్ల క్రితమే చనిపోయింది... తండ్రి బతుకుదెరువు కోసం మరో ఊరిలో ఉంటున్నాడు... తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో ఆ బాలిక ఒంటరిగా ఉంటోంది... అప్పుడప్పుడు ఆమె ఇంటికెళ్లే కజిన్ ఒకానొక రోజు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు... అది అక్కడితో ఆగలేదు... ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి కొన్ని నెలలుగా బాలికపై అత్యాచారం చేశాడు... బాలిక గర్భం దాల్చి ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది... ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ బాలిక పుట్టిన బిడ్డను బావిలో విసిరేసింది.పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని విచారించడంతో.. ఆమెపై జరిగిన అత్యాచారకాండ వెలుగుచూసింది.

అసలేం జరిగింది..
పోలీసుల కథనం ప్రకారం... మధ్యప్రదేశ్లోని భదోరియాకు చెందిన 14 ఏళ్ల బాలిక తల్లి మూడేళ్ల క్రితం చనిపోయింది.తండ్రి బతుకుదెరువు రీత్యా మరో చోట ఉంటున్నాడు.దీంతో గ్రామంలోని ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంటోంది.అప్పుడప్పుడు 21ఏళ్ల ఆమె కజిన్ ఇంటికి వస్తుండేవాడు.ఇదే క్రమంలో గతేడాది అక్టోబర్లో ఓరోజు బాలిక ఇంటికి వెళ్లిన అతను... ఆ సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన నలుగురు స్నేహితులతో కలిసి పలుమార్లు బాలికపై గ్యాంగ్ రేప్కి పాల్పడ్డాడు.

8నెలలుగా అత్యాచారం...
అక్టోబర్ 2020 నుంచి మే 2021 వరకు 8 నెలలుగా బాలిక కజిన్,అతని నలుగురు స్నేహితులు కలిసి బాలికపై తరచూ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. తన బాధ చెప్పుకుందామన్నా ఎవరూ లేక ఆ బాలిక మౌనంగా ఇదంతా భరించింది. ఈ క్రమంలో ఓరోజు బాలికకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో తన కజిన్తో చెప్పింది. అతను గ్రామంలోని ఓ మంత్రసాని దగ్గరికి బాలికను తీసుకెళ్లాడు.బాలికను పరీక్షించిన ఆ మంత్రసాని గర్భవతి అని తేల్చింది.దీంతో బాలిక కజిన్ ఆమెకు అబార్షన్ మాత్రలు ఇచ్చాడు. దీంతో ఇంకా ఎదగని శిశువుకు ఆ బాలిక జన్మనిచ్చింది. అనంతరం ఇద్దరు కలిసి పుట్టిన బిడ్డను ఓ బావిలో విసిరేశారు.

ఇలా వెలుగులోకి
బావిలో శిశువు మృతదేహంపై పోలీసులకు సమాచారం అందడంతో మొదట ఆ బాలికను అదుపులోకి తీసుకుని విచారించారు.దీంతో తనపై జరిగిన ఆకృత్యాలను బాలిక పోలీసులకు వెల్లడించింది.వెంటనే పోలీసులు ఆమె కజిన్తో పాటు అతని స్నేహితులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్ బాలురు ఉన్నట్లు గుర్తించారు. బాలికను జువైనల్ బోర్డు ముందు ప్రవేశపెట్టి... అనంతరం జువైనల్ హోమ్కు తరలించారు.ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
Recommended Video

మైనర్ బాలికలపై అత్యాచారాల్లో టాప్లో మధ్యప్రదేశ్..
నేషనల్ క్రైమ్ బ్యూరో 2020 లెక్కల ప్రకారం... మహిళలపై నేరాల్లో ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,ఢిల్లీ,రాజస్తాన్,టాప్లో ఉన్నాయి. వరుసగా రెండో ఏడాది రాజస్తాన్ టాప్ లిస్టులో చేరింది. గతేడాది రాజస్తాన్లో 34,535,ఉత్తరప్రదేశ్లో 49,385,పశ్చిమ బెంగాల్లో 36,439 కేసులు నమోదయ్యాయి. అత్యాచార కేసుల్లో రాజస్తాన్ 5310 కేసులతో టాప్లో ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో 2769 కేసులతో ఉత్తరప్రదేశ్ ఉంది.మైనర్ బాలికలపై అత్యాచారాల్లో మధ్యప్రదేశ్ టాప్లో ఉంది.గతేడాది మధ్యప్రదేశ్లో 3259 మంది మైనర్ బాలికలు అత్యాచారాలకు గురైనట్లుగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2785,ఉత్తరప్రదేశ్లో 2630 కేసులు నమోదయ్యాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యధికంగా ఢిల్లీలో గతేడాది 967 కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాతి స్థానంలో 409 కేసులతో రాజస్తాన్ రాజధాని జైపూర్ నగరం ఉన్నది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications