Bar Shops: బార్లు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. మహిళల హర్షం..
బార్ షాపులను మూసివేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సీనియర్ బీజేపీ నాయకురాలు ఉమాభారతి నిరసనల తరువాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని బార్ షాపులను మూసివేయాలని నిర్ణయించింది. 'అహటాస్' (ప్రజలు తాగడానికి మద్యం దుకాణానికి అనుబంధంగా ఉన్న ప్రాంతం) దుకాణాలు మాత్రమే మద్యం విక్రయించడానికి ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మధ్యప్రదేశ్ లో "నియంత్రిత మద్యం పాలసీ" కోసం ఉమాభారతి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.

బార్లు
"రాష్ట్రంలో అన్ని అహటాలు, షాపు బార్లు మూసివేశారు. ఇక నుంచి కేవలం దుకాణాలలో మద్యం విక్రయిస్తారు. మద్యపాన స్థలాలను అనుమతించబోమని" రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదివారం క్యాబినెట్ సమావేశం తర్వాత చెప్పారు. విద్యాసంస్థలు, బాలికల హాస్టళ్లు, మతపరమైన స్థలాల నుంచి మద్యం దుకాణాల దూరాన్ని 50 మీటర్ల నుంచి 100 మీటర్లకు పెంచుతున్నామని ప్రకటించారు.

లైసెన్స్లు
మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్స్లను రద్దు చేసేలా చట్టం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మిశ్రా తెలిపారు. ఉమా గత కొద్ది కాలంగా మద్యం వినియోగానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఎక్సైజ్ పాలసీల ద్వారా ప్రజల మద్యపాన అలవాటును క్యాష్ చేసుకోవద్దని శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు.

ఆవులు
దేవాలయాలు, రాజభవనాలకు ప్రసిద్ధి చెందిన నివారి జిల్లాలోని ఓర్చా పట్టణంలోని మద్యం దుకాణం ముందు ఆమె రెండు ఆవులను కట్టివేసి, తన 'మధుశాల మే గౌశాల' (మద్యం విక్రయశాలలో ఆవుల పెంపకం) కార్యక్రమంలో పాలు తాగమని, మద్యం తాగవద్దని ప్రజలను ఉద్బోధించారు. మద్యం విక్రయాలకు నిరసనగా ఆమె గతంలో కూడా ఈ షాపుపై పేడను కూడా విసిరారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. పూర్తిగా మద్య నిషేధం చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications