శివాజీ గణేషన్ విగ్రహంలో కరుణానిధి పేరు మాయం: తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు !
తమిళ చిత్రరంగంలో బహుముఖ ప్రజ్ఞ కలిగిన శివాజీ గణేశన్ విగ్రహంలో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి పేరు ఎందుకు తొలగించారో రెండు వారాల్లో చెప్పాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు నోట
చెన్నై: తమిళ చిత్రరంగంలో బహుముఖ ప్రజ్ఞ కలిగిన శివాజీ గణేశన్ విగ్రహంలో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి పేరు ఎందుకు తొలగించారో రెండు వారాల్లో చెప్పాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
చెన్నై నగరం సమీపంలోని వడపెరుంబాక్కానికి చెందిన డీఎంకే పార్టీ న్యాయవాది పి. కరుణానిధి దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు విచారణకు స్వీకరించింది. శివాజీ గణేశన్ విగ్రహాన్ని మెరీనా బీచ్ తీరంలో ప్రతిష్టించారని, అక్కడ ట్రాఫిక్ ఇబ్బందుల కారణాలు తెలుపుతూ తొలగించారని పిటిషన్ లో వివరించారు.
శివాజీ గణేశన్ విగ్రహాన్ని అనంతరం శివాజీ గణేశన్ స్మారకమండపంలో ఏర్పాటు చేశారని పిటిషన్ లో తెలిపారు. శివాజీ గణేశన్ విగ్రహంలో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి పేరును రాజకీయ కారణాల వలన తొలగించారని పిటిషన్ లో పేర్కొన్నారు.
తమిళనాడు ప్రభుత్వం కావాలనే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి పేరును శివాజీ గణేశన్ విగ్రహం నుంచి తొలగించారని, అందులో మళ్లీ కరుణానిధి పేరును పొందుపరిచేందుకు ప్రభుత్వానికి ఉత్వర్వులు ఇవ్వాలని న్యాయవాది పిటిషన్ లో కొరారు.
పిటిషన్ విచారణకు స్వీకరించిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి రవిచంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి పేరును శివాజీ గణేశన్ విగ్రహం నుంచి ఎందుకు తొలగించారో రెండు వారాల్లో సంజాయిషీ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు అందజేసింది.