చైనాతో విభేధాలపై కేంద్రం ప్రకటన - సంక్షోభం ముదిరింది - చర్చలకే ప్రాధాన్యం: ఫారిన్ సెక్రటరీ ష్రింగ్ల
గడిచిన నాలుగు నెలలుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. చైనాతో విభేదాలపై మోదీ సర్కార్ తొలిసారి అనూహ్య ప్రకటన చేసింది. డ్రాగన్ హద్దుమీరి ప్రవర్తిస్తున్నదని, సంక్షోభం తారాస్థాయికి చేరిందని తెలిపింది. ఇన్నాళ్లూ చైనా చర్యలను ఉపేక్షిస్తున్నట్లుగా వెలువడిన ప్రకటనలకు విరుద్ధంగా.. శుక్రవారం నాటి ప్రెస్ మీట్ లో విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా అనూహ్య వ్యాఖ్యలు చేశారు.
''ప్రస్తుతం చైనాతో సంక్షోభం బాగా ముదిరింది. సరిహద్దులో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. 1962 యుద్ధం తర్వాత ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాలేదు. 40 ఏళ్లలో లేని విధంగా, తొలిసారి మనం 20 మంది జవాన్లను పోగొట్టుకున్నాం. జరగని సైనికుల జీవితాలను మేము మొదటిసారిగా కోల్పోయాం'' అని ష్రింగ్లా అన్నారు.

పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నది భారత్ విధానమని, ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని, ఆసియాన్ బలోపేతం కావలన్నది తమ అభిమతమని, అంతమాత్రాన దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా వ్యాఖ్యానించారు.
Recommended Video
కాగా, చైనాతో విభేదాలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తున్నదని, బాధ్యత కలిగిన దేశం కాబట్టే మిలటరీ స్థాయిలో, దౌత్య స్థాయిలో చర్చలు కొనసాగిస్తూనే ఉంటామమని ష్రింగ్లా స్పష్టం చేశారు. చైనాతో ఉద్రిక్తతల్లో తీవ్రత ఉన్నప్పటికీ.. సవాళ్లను ఎదుర్కోవడం భారత్ కు కొత్తేమీ కాదని, ఎల్ఏసీ వెంబడి ఏప్రిల్ నాటి యథాతథ పరిస్థితి ఉండాలన్నదే భారత్ అభిమతమని విదేశాంగ శాఖ కార్యదర్శి అన్నారు.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
వేసవిలో ఈ చల్లని ప్రాంతాలకు వెళ్తే ఆ కిక్కే వేరప్పా.. -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications