ఎక్స్ట్రా అమౌంట్: ఏటీఎంకు పోటెత్తిన జనాలు..ఎక్కడంటే?
నాగ్పూర్: ఓవ్యక్తికి ఏటీఎంలో 500 డబ్బులు డ్రా చేయగా 2వేల 500 రూపాయలు వచ్చాయి. దీంతో ఆవిషయం చుట్టుపక్కల దావానంలా వ్యాపించడంతో చుట్టు పక్కల గ్రామాల జనాలు ఏటీఎంకి పోటెత్తారు. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరి.. సాంకేతిక లోపం కారణంగా డినామినేషన్ 100 రూపాయలకు బదులు 500 రూపాయల నోట్లు వచ్చినట్లు అధికారి చెప్పడంతో.. ఆబ్యాంక్ ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు.
డబ్బుల డ్రాచేయడానికి ఏటీఎంకి వెళ్లిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నాగ్పూర్ జిల్లాకి చెందిన ఓవ్యక్తి డబ్బుల కోసం ఏటీఎం వెళ్లి 500 రూపాయలు విత్ డ్రా చేయగా 2 వేల 500 రూపాయలు వచ్చాయి. డినామినేషన్ ప్రకారం రెండు 500 నోట్లు రావల్సి ఉండగా.. ఐదు నోట్లు రావడంతో ఆశ్చర్యపోవడం సదరు వ్యక్తి వంతైంది. ఈవిషయం దావానలంలా వ్యాప్తించడంతో చుట్టు పక్కల గ్రామాల జనాలు డబ్బుల కోసం ఏటీఎంకు పోటెత్తారు.
నాగ్పూర్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో గల ఓ ప్రైవేట్ బ్యాంక్ కి చెందిన ఏటీఎంలో డబ్బులు ఎక్కువగా వస్తున్నాయని జనాలు ఎగబడటంతో బ్యాంక్ ఖాతాదారుల్లో ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరి జనాన్ని చెదరగొట్టి ఏటీఎంని మూసివేశారు. అనంతరం ఈవిషయాన్ని సంబంధిత బ్యాంకు అధికారులకు తెలియజేశారు.
ఏటీఎంలో అధికంగా డబ్బుల రావడంపై బ్యాంకు అధికారులు స్పందించారు. ఏటీఎంలో సాంకేతికలోపం కారణంగా డినామినేషన్ 100 కి బదులు 500గా నమోదు అయినట్లు తద్వారా ఖాతాదారుడు ఎంటర్ చేసిన దానికంటే అదనంగా డబ్బులు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తమ సాంకేతిక విభాగం ఏటీఎంలోని లోపాలను సరిచేసే ప్రయత్నంలో ఉన్నట్లు సదరు బ్యాంకు అధికారులు తెలిపారు. ఖాతాదారులు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని వారు స్పష్టం చేశారు.