ఉద్ధవ్తో కలుస్తా, మేం ఒక్కటవుతాం: రాజ్ సంచలనం
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత అవసరమైతే శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ థాకరేతో చేతులు కలపడానికి తాము సిద్ధమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులను బట్టి తాము కూటమి కట్టే వీలుందని బుధవారం ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ వెల్లడించారు.
అలాంటప్పుడు వారిద్దరూ ఒకే వేదిక పైకి రాకపోవడానికి కారణమేమిటన్న ప్రశ్నకు... మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు, అభివృద్ధి కోసం అవసరమైతే మా సోదరులిద్దరం ఒక్కటవుతామని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠ, పట్టుదల కన్నా రాష్ట్రమే తనకు అత్యంత ముఖ్యమన్నారు.

ఈ విషయంలో ఇతరులు బాధపడాల్సిందేమీ లేదని, జోక్యం చేసుకునే అవసరం అసలే లేదన్నారు. కాగా, బీజేపీ - శివసేన పాతికేళ్ల కూటమి విచ్ఛిన్నమైన నేపథ్యంలో శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన.. రెండూ చేరువ కావచ్చునని రాజకీయ విశ్లేషకులూ భావిస్తున్నారు. సోదరులిద్దరూ ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శలు చేస్తుండటం గమనార్హం.
టీవీ ఛానల్ ప్రతినిధితో మాట్లాడిన రాజ్ థాకరే.. మహారాష్ట్రలో బీజేపీకి మెజార్టీ వస్తుందన్న వార్తలను కొట్టి పారేశారు. ఉద్ధవ్ థాకరేతో తనకు ఫోన్ చేసినట్లుగా వస్తున్న ఊహాగానాలను కొట్టి పారేశారు. తనకు అనారోగ్యంగా ఉన్న సమయంలో మాత్రం ఫోన్ చేశాడని చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications