లోకల్, నాన్ లోకల్ ట్యాగ్, ఆ రోజు తాత, ఇప్పుడు మనమడు, టార్గెట్ మోదీ, యోగి, ఠాక్రే రూటే సపరేటు !
లక్నో/ముంబాయి: బీజేపీతో మూడు సంవత్సరాల క్రితం వరకు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన శివసేన ఇప్పుడు పాత మిత్రపక్షాన్ని నువ్వానేనా అంటూ ఢీకొడుతోంది. మహారాష్ట్రకే పరిమితం అయిన శివసేన పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో శివసేన తన సత్తా చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ఎలాగైనా బోణి కొట్టి అక్కడి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు షాక్ ఇవ్వడానికి సిద్దం అయ్యింది. శివసేన వ్యవస్థాపకుడు బాలసాహెబ్ ఠాక్రే వారుసుడిగా రంగంలోకి దిగిన ఆదిత్య ఠాక్రే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో జోరుగా ప్రచారం చేస్తున్నాడు. లోకల్, నాన్ లోకల్ నినాదంతో బాల్ ఠాక్రే అప్పట్లో మహారాష్ట్రలో శివసేనను ఓ రైంజ్ లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు తాత బాల్ ఠాక్రే వారసత్వం అందిపుచ్చుకోవడానికి ఆయన మనుమడు, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మహారాఫ్ట్ర బయట కూడా బీజేపీని దెబ్బ కొట్టాలని శివసేన ప్రయత్నిస్తున్నది. బీజేపీ నాయకులు నిజమైన శ్రీరాముడి భక్తులు కాదని, వాళ్లు డ్రామాలు ఆడుతున్నారని, మేమే నిజమైన శ్రీరాముడి భక్తులు అని శివసేన జోరుగా ప్రాచారం చేస్తోంది.

ఉత్తరప్రదేశ్ లో ప్రాచారం చేస్తున్న ఆదిత్య ఠాక్రే
ఉత్తరప్రదేశ్ లో మిగిలిన ఉన్న శాసన సభ నియోజక వర్గాల్లో తమ సత్తా చాటుకోవాలని ఆ రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ముంబాయి సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తున్నారు.

ఆదిత్య ఠాక్రే మార్క్ ప్రచారం
ఉత్తరప్రదేశ్ లోని సిద్దార్థ నగర్ జిల్లాలోని దోమరియాగంజ్ లో ఆదిత్య ఠాక్రే జోరుగా ప్రచారం చేశారు. తరువాత ప్రయోగరాజ్ లోని కొరాన్ నియోజక వర్గంలో ఆదిత్య ఠాక్రే ప్రచారం చేస్తారని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అంటున్నారు. మహారాష్ట్ర వెలుపల కూడా మేము 2024 నాటికి సత్తా చాటుకుంటామని శివసేన సీనియర్ నాయకుడు విశ్వజీత్ సింగ్ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు స్టేట్ మెంట ఇచ్చారు.

బీజేపీతో పోరాటం చేస్తున్న శివసేన
బీజేపీతో మూడు సంవత్సరాల క్రితం వరకు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన శివసేన ఇప్పుడు పాత మిత్రపక్షాన్ని నువ్వానేనా అంటూ ఢీకొడుతోంది. మహారాష్ట్రకే పరిమితం అయిన శివసేన పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

తాత వారసుడిగా మనుమడు
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో శివసేన తన సత్తా చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ఎలాగైనా బోణి కొట్టి అక్కడి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు షాక్ ఇవ్వడానికి సిద్దం అయ్యింది. శివసేన వ్యవస్థాపకుడు బాలసాహెబ్ ఠాక్రే వారుసుడిగా రంగంలోకి దిగిన ఆదిత్య ఠాక్రే (31) ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో జోరుగా ప్రచారం చేస్తున్నాడు.

ఆ రోజు లోకల్ నాన్ లోకల్...... ఇప్పుడు అదే మంత్రం
లోకల్, నాన్ లోకల్ నినాదంతో బాల్ ఠాక్రే 1966లో మహారాష్ట్రలో శివసేనను ఓ రైంజ్ లోకి తీసుకెళ్లారు. దాదాపుగా 50 ఏళ్ల తరువాత ఇప్పుడు తాత బాల్ ఠాక్రే వారసత్వం అందిపుచ్చుకోవడానికి ఆయన మనుమడు, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తాత బాల్ ఠాక్రే అప్పుడు చేసిన మత్ర జపం ఇప్పుడు ఆయన మనుమడు ఆదిత్య ఠాక్రే చేస్తున్నారు.
Recommended Video

బీజేపీ నకిలి భక్తులు.... మేమే నిజమైన రాముడి భక్తులు
ఇప్పటికే బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మహారాఫ్ట్ర బయట కూడా బీజేపీని దెబ్బ కొట్టాలని శివసేన ప్రయత్నిస్తున్నది. బీజేపీ నాయకులు నిజమైన శ్రీరాముడి భక్తులు కాదని, వాళ్లు డ్రామాలు ఆడుతున్నారని, మేమే నిజమైన శ్రీరాముడి భక్తులు అని శివసేన జోరుగా ప్రాచారం చేస్తోంది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications