మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్: ముగ్గురు మావోయిస్టులు హతం
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరౌలీలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సీ 60 కమాండో పోలీసుల బృందం జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల్లో పర్మిలి దళ కమాండర్ బిట్లు మాధవి కూడా ఉన్నారు. మన్నెరజరం అడవుల్లో మొత్తం 25 మంది మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
స్థానికంగా క్యాంపును ఏర్పాటు చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడకు వెళ్లగా.. నక్సల్స్ దాడికి దిగారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురు బిట్లు మాధవి సహా మరో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల వద్ద నుంచి ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరణించిన నక్సల్స్ను పెరిమిలి దళం కమాండర్ బిట్లు మాదవి, పెరిమిలి దళానికి చెందిన వాసు, ఆహేరి దళానికి చెందిన శ్రీకాంత్గా గుర్తించారు. మార్చి 9న విద్యార్థిని హత్యకేసులో బిట్లు మాధవి ప్రధాన నిందితురాలు.

కాగా, మార్చి 26న ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు జరిపిన ఐఈడీ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరిలో 10 మంది పోలీసులు కాగా ఒకరు డ్రైవర్. దంతెవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో బుధవారం ఉదయం డిస్ట్రిక్ రిజర్వ్గార్డ్ పోలీసులు.. ప్రత్యేక యాంటీ-నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు.
ఆ ఆపరేషన్ ముగించుకుని మినీ వ్యాన్లో తిరిగివస్తుండగా.. అరణ్పుర్ ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీతో వాహనాన్ని పేల్చేశారు. దాడి జరిగిందని సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం స్థానిక అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భారీగా కూంబింగ్ చేపట్టారు.
మరోవైపు, ఇటీవలే జార్ఖండ్లో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఐదుగురు నక్సలైట్లు మృతి చెందారు. వీరిలో ఇద్దరిని స్పెషల్ ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. రాజధాని రాంచీకి 160 కి.మీ. దూరంలోని ఈ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై సమాచారం రావడం వల్ల సీఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపైకి మావోయిస్టులు కాల్పులు జరపగా.. ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటన స్థలంలో రెండు ఏకే-47 తుపాకులు, రెండు నాటు తుపాకులు సహా మరికొన్ని ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications