మరో రెండు రాష్ట్రాల్లో కోవిడ్ ధర్డ్ వేవ్-టాస్క్ ఫోర్స్ సభ్యుడి కీలక ప్రకటన-బీహార్ తర్వాత
దేశవ్యాప్తంగా కోవిడ్ ముప్పు పెరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు కూడా నమోదవుతున్నాయి. కోవిడ్ 19 సాధారణ కేసులతో పాటు ఓమిక్రాన్ కేసులు కూడా తోడవడంతో ధర్డ్ వేవ్ భయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ తమ రాష్ట్రంలో కోవిడ్ ధర్డ్ వేవ్ మొదలైందని తాజాగా ప్రకటించారు. ఇప్పుడు మరో రెండు రాష్ట్రాల్లో కోవిడ్ ధర్డ్ వేవ్ ప్రారంభమైందని తెలుస్తోంది.
ముంబై, ఢిల్లీలో కోవిడ్ 19 ధర్డ్ వేవ్ ప్రారంభమైందని మహారాష్ట్ర ప్రభుత్వ కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడైన డాక్టర్ రాహుల్ పండిట్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యధిక కోవిడ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలుగా మహారాష్ట్ర, ఢిల్లీ రికార్డుల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడైన రాహుల్ పండిట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాహుల్ వ్యాఖ్యలే నిజమైతే దేశంలో కోవిడ్ ధర్డ్ వేవ్ సోకిన రాష్ట్రాల సంఖ్య మూడుకు చేరబోతోంది.
ముంబై, ఢిల్లీలో కేసులు రెట్టింపు అవుతున్న తీరు చూస్తుంటే ఇవి ఓమిక్రాన్ యొక్క లక్షణాలు అని సూచిస్తున్నాయిని రాహుల్ తెలిపారు. అయితే ఓమిక్రాన్ వాటా ఎంతో అర్థం చేసుకోవడానికి తాము గత కొన్ని రోజుల జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికల కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం, ఇది డెల్టా, ఓమిక్రాన్ రెండింట్ మిశ్రమగం ాడాక్టర్ రాహుల్ పండిట్ ఇండియా టుడే టీవీతో అన్నారు.

కోవిడ్ -19 టాస్క్ఫోర్స్ సభ్యుడైన రాహుల్ పండిట్ కేసుల పెరుగుదలకు సంబంధించి ఆసుపత్రుల రేటును చూడటానికి దాదాపు పది రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో లాక్డౌన్ ఉంటుందా అని అడిగినప్పుడు, ఆరోగ్య మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఒక వైద్యుడిగా, ప్రజలు తప్పనిసరిగా నియమాలను పాటించాలని, లక్షణాలు కనిపిస్తే స్వయంగా పరీక్షించుకోవడానికి వెనుకాడవద్దని తాను సిఫార్సు చేస్తున్నానన్నారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలపై విపరీతమైన ఒత్తిడి ఉందని ప్రభుత్వం భావిస్తేనే లాక్డౌన్ విధిస్తుందని ఆయన తెలిపారు. అప్పటి వరకు దాని అవసరం లేదని, ప్రజలు నిబంధనలను పాటించి, బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించాలి, "అని డాక్టర్ రాహుల్ పండిట్ సూచించారు.












Click it and Unblock the Notifications