మహాత్మాగాంధీ ‘తెలివైన వ్యాపారి’ అన్న అమిత్ షా.. మండిపడిన కాంగ్రెస్
మహాత్మాగాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైశ్య కులాన్ని ఉద్దేశిస్తూ ఆయన తెలివైన వ్యాపారి (చతుర్ బనీయా) అని షా అభివర్ణించారు.
రాయ్పూర్: మహాత్మాగాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైశ్య కులాన్ని ఉద్దేశిస్తూ ఆయన తెలివైన వ్యాపారి (చతుర్ బనీయా) అని షా అభివర్ణించారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జాతిపితను, స్వాతంత్ర్య ఉద్యమాన్ని అవమానించడమేనని, ఇందుకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయగా.. షా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

రాయ్పూర్లో అమిత్ షా మాట్లాడుతూ ఎలాంటి సిద్ధాంత భూమిక లేకుండానే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైందని, దేశ స్వాతంత్ర్య సాధన కోసమే ఆ పార్టీని ఏర్పాటు చేశారని అన్నారు. అందుకే స్వాతంత్ర్యం రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని గాంధీ కోరుకున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్ను రద్దు చేసే పనిని నాడు గాంధీజీ చేయలేకపోయినా, నేడు కొందరు ఆ పనిని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గాంధీని సంకుచిత రీతిలో పోల్చడం ద్వారా ఆయనను అమిత్ షా అవమానించారని, షా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
More From
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications