భారీ విజయం: ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సైఫుల్లా హతం
శ్రీనగర్: ఉగ్రవాదులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూకాశ్మీర్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ హతమయ్యాడు. మరో ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.
ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో.. జమ్మూ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సమయంలో హిజ్బుల్ కమాండర్ డాక్టర్ సైపుల్లా తోపాటు మరో ఉగ్రవాది పోలీసులపైకి కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి.

ఈ కాల్పుల్లో హిజ్బుల్ కమాండర్ సైఫుల్లా హతమయ్యాడు. మరో ఉగ్రవాదిని ప్రాణాలతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, మే నెలలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ కమాండర్గా ఉన్న రెయిజ్ నైకూ హతమయ్యాడు. అప్పట్నుంచి డాక్టర్ సైఫుల్లానే హిజ్బుల్కు నాయకత్వం వహిస్తున్నాడు. అనేక దాడుల్లో ఉన్న సైఫుల్లా భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో సైఫుల్లా కూడా హతమయ్యాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications