Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీ ఎర్రకోట కేసులో బిగ్ ట్విస్ట్..! 32 పేలుళ్ల కుట్ర-నిఘా వర్గాల షాకింగ్..!

ఢిల్లీ ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న పేలుళ్ల కేసు తవ్వే కొద్దీ షాకింగ్ వాస్తవాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించిన ఎన్ఐఏ బృందాలకు నిఘా వర్గాల నుంచి అందుతున్న విషయాలు విభ్రాంతి కలిగించేలా ఉన్నాయి. వీటిలో ఢిల్లీ ఎర్రకోట వద్ద ఒక్క కారు పేల్చి విధ్వంసం సృష్టించాలన్నది తీవ్రవాదుల ఆలోచన కాదని తేలింది. ఢిల్లీతో పాటు వివిధ నగరాల్లో 32 కార్లను పేల్చేందుకు వారు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు తీవ్రవాదులు హ్యుండాయ్ ఐ20 కారుతో పాటు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారు రూపురేఖలు మార్చి పేలుళ్లకు వాడేందుకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. ఈ రెండు కార్లను పేల్చిన తర్వాత మొత్తం 32 కార్లను వివిధ నగరాల్లో పేల్చడం ద్వారా భారీ విధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఎనిమిది మంది అనుమానితులు పేలుడు సామాగ్రిని గ్రూపులుగా విడిపోయి ఆయా నగరాలకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వివిధ నగరాల్లో ఐఈడీలను అమర్చి ఈ పేలుళ్లు ఏకకాలంలో జరపాలని వీరు ప్లాన్ చేసినట్లు సమాచారం.

Major Twist in Delhi Blasts Case Intelligence Uncovers 32-Vehicle attack Plan

ఈ ప్లాన్ చేసిన వారిలో ఇప్పటికే అరెస్టు చేసిన డాక్టర్లు ముజమ్మిల్, అదీల్, ఉమర్, షహీన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ ఆపరేషన్ కోసం 20 లక్షల రూపాయలు పోగు చేసి డాక్టర్ ఉమర్ కు వీరు అందించినట్లు గుర్తించారు. ఈ మొత్తంతో 20 క్వింటాళ్ల నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం తో కూడిన ఎన్పీకే ఎరువు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందులో 3 లక్షలు గురుగ్రామ్ ప్రాంతం నుంచే సేకరించినట్లు గుర్తించారు. ఇందుకోసం ప్రధాన నిందితుడు ఉమర్ రహస్యంగా ఉండేలా ప్రైవేట్ సిగ్నల్ గ్రూప్ క్రియేట్ చేశాడు.ఇందులో మరో నలుగురిని సభ్యులుగా యాడ్ చేశాడు.

Major Twist in Delhi Blasts Case Intelligence Uncovers 32-Vehicle attack Plan

అలాగే ముజమ్మిల్ గతంలో ఐసిస్ కు అనుబంధంగా ఉన్న అన్సర్ గజ్వతుల్ హింద్ అనే సంస్థకు 2021 నుంచి 2022 వరకూ పనిచేశాడు. అతను ఈ తీవ్రవాద సంస్థకు ఇర్ఫాన్ అనే మరో వ్యక్తి ద్వారా పరిచయం అయినట్లు తేలింది. వీరంతా స్వతంత్ర తీవ్రవాద సంస్థ ఏర్పాటు చేసేందుకు 2023-24 మధ్య చేసిన ప్రయత్నాల్లో ఆయుధాలు పోలీసులకు లభ్యమయ్యాయి. దీంతో వీరి నెట్ వర్క్ మొత్తాన్ని ఛేదించేందుకు పోలీసులు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు.ఢిల్లీ పేలుడు తర్వాత నిందితుడు ఉమర్ వాడిన ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారును పోలీసులు ఖండవాలీ గ్రామంలో స్వాధీనం చేసుకున్నారు. ఇతను పేలుళ్లలో చనిపోయాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+