మమతా బెనర్జీ ఏం చెప్పినా.. బెంగాల్‌లలో అధికారం మాదే: జేపీ నడ్డా తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీజేపీ గెలవదంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేస్తున్నప్పటికీ.. తాము గెలిచి చూపిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. టీఎంసీ ఓడిపోతుందని మమతా బెనర్జీకి తెలుసన్నారు. తన కాన్వాయ్ నడ్డా వాహనంపై కొందరు టీఎంసీ కార్యకర్తలుగా దాడి చేశారని జేపీ నడ్డా ఆరోపించరు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు.

ఈ దాడి అపూర్వమైనదని ఆయన ఎద్దేవా చేశారు. మమత హయాంలో రాష్ట్రంలో చట్టాలు పనిచేయడం లేదని, గుండారాజ్ రాజ్యమేలుతోందని జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. కాగా, జేపీ నడ్డా వాహణ శ్రేణిపై జరిగిన దాడిని ఒక నాటకంగా అభివృర్ణించారు సీఎం మమతా బెనర్జీ.

 mamata banerjee di always says hobey naa, but we will win Bengal: JP Nadda

ఇలాంటి దాడులు తమను ఏమీ చేయలేవని జేపీ నడ్డా అన్నారు. ఎన్నికల్లో గెలిచిన వ్యక్తులకే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలావుందో ఆలోచిచించాలని ఆయన అన్నారు. 130 మంది బీజేపీ కార్యకర్తలను ఈ పోరాటంలో పోగొట్టుకున్నామని అన్నారు. మమతా బెనర్జీ పాలన ఇలా కొనసాగుతోందని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం తుఫాను, కరోనా నియంత్రణ నిధులను మమతా బెనర్జీ తప్పుదోవ పట్టించారన్నారు. నిధుల తనిఖీ జరుగుతోందన్నారు. మమత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయయిందన్నారు. కేంద్రం పంపిన నిధులు సుమారు 70 లక్షల మంది రైతులకు అందలేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+