భార్యను రూ.30 వేలకు అమ్మేశాడు, వేశ్యావాటిక
బెంగళూరు: జల్సాల కోసం కట్టుకున్న భార్యను కసాయి భర్త వేశ్యవాటిక కేంద్రంలో విక్రయించాడు. ఆమెను పశువును కొన్నట్లు కొనుగోలు చేసిన నీచుడు ఆమెతో వ్యభిచారం చేయించాడు. చివరికి ఆమె ఎయిడ్స్ వ్యాధికి గురై చావుకు దగ్గర అయ్యింది.
ఐటి, బీటి సిటి బెంగళూరులోనే ఈ దారుణం జరిగింది. బెంగళూరు సీసీబీ పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విదంగా ఉన్నాయి. బెంగళూరులోని సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని గణపతి నగర లోని ఇంటిలో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.
గురువారం రాత్రి పోలీసులు ఆ ఇంటి మీద దాడి చేశారు. దాడి సమయంలో వేశ్యావాటిక కేంద్రం నిర్వహిస్తున్న కృష్ణతో పాటు సునీల్, శివ లింగయ్య, లింగరాజు అనే నిందితులను అరెస్టు చేశారు. ఇదే సమయంలో కొందరు మహిళలను పోలీసులు రక్షించారు.

అందులో ఒక మహిళ చెప్పిన వివరాలు తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు. 32 సంవత్సరాల మహిళ తన భర్త నరసింహ (35) కృష్ణ దగ్గర రూ.30 వేలు తీసుకుని తనను అమ్మేశాడని బోరున విలపించింది. ఈ వేశ్యవాటిక కేంద్రంలోనే తనకు ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని చెప్పింది.
విషయం తెలుసుకున్న పోలీసులు భార్యను విక్రయించిన నరసింహను అరెస్టు చేసి బెండు తీశారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈమెతో కలిసి సెక్స్ లో పాల్గొన్న వారికి ఎయిడ్స్ వ్యాధి వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications