అద్దెకున్న వాడిపై నెట్టడానికి కొడుకును చంపేశాడు
న్యూఢిల్లీ: తన ఇంట్లో కిరాయికి ఉంటున్న ఓ వ్యక్తి తనకు రావాల్సిన అద్దె డబ్బులు ఇవ్వడం లేదని ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కిరాయి ఉన్న వ్యక్తికి తాను ఏమిటో నిరూపించాలనుకున్నాడు. అందులో భాగంగా ఆయన ఏకంగా తన కొడుకునే చంపేశాడు.
ఈ సంఘటన ఢిల్లీలోని సునేరీ బాగ్ ప్రాంతానికి చెందిన శాంతి ప్రసాద్ తన ఇంట్లో ఓ పోరేషన్ను ఓ వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. కిరాయికి ఉన్న వ్యక్తి అద్దె చెల్లించడం లేదు. అంతేకాదు, ఇల్లు ఖాళీ చేయకుండా బెదిరిస్తుండేవాడు.

అతని వేధింపులు భరించలేక తాను ఏమీటో తెలియజేయాలనుకున్నాడు యజమాని. ఏవేవో ఆలోచనలు చేసి, చివరకు తన కొడుకును అతి ఘోరంగా గొంతు కోసి, బండరాయితో తలపై మోది చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో అతను మాట్లాడుతూ... నా ఇంట్లో రెంట్కి ఉంటున్న వాడిని బెదిరించాలనుకున్నానని, అందుకే తన కొడుకును చంపేశానని చెప్పాడు. కొడుకును చంపి, అద్దెకు ఉన్న వాడిని చిక్కుల్లో పెడదామనుకున్నాడు. కానీ పోలీసుల విచారణలో అతను అసలు విషయం చెప్పాడు.












Click it and Unblock the Notifications