పడక గదిలో భార్యతో: మర్మాంగం నరికేశాడు
హర్దా: పక్కింటి మగాడు తన భార్యతో పడకగదిలో కలిసి ఉండటం చూసిన వ్యక్తి కోపం తట్టుకోలేక అతని మర్మాంగం నరికేసి దారుణంగా చంపేసిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. హర్దా నగరం సమీపంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
గల బస్పని గ్రామంలో మంగళ్ (45) అనే వ్యక్తి భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. మంగళ్ ఇంటి పక్కనే పతిరామ్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చాల కాలం నుంచి మంగళ్ భార్యతో పతిరామ్ అక్రమ సంబంధం సాగిస్తున్నాడు.
భార్యకు అనేక సార్లు ఇలాంటి పని చెయ్యరాదని, పరువు పోతుందని హెచ్చరించాడు. అదే విధంగా పలు సార్లు పతిరామ్ కు వార్నింగ్ ఇచ్చాడు. అయితే వారిద్దరూ మంగళ్ హెచ్చరికలను లెక్కచెయ్యలేదు. మంగళవారం మంగళ్ భార్యతో కలిసి పతిరామ్ బెడ్ రూంలో నగ్నంగా అభ్యంతరకర రీతిలో దర్శనం ఇచ్చాడు.
అంతే మంగళ్ కోపంతో ఊగిపోయాడు. ఇంటిలో ఉన్న గొడ్డలి తీసుకుని పతిరామ్ మర్మాంగం మీద ఒక్క వేటు వేశాడు. మర్మాంగం తెగి కిందపడిపోవడంతో పతిరామ్ సంఘటనా స్థలంలో మరణించాడని రాఘట్ గాన్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ రఘువంశీ చెప్పారు.
తాను పోలీసులకు లొంగిపోతున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిన మంగళ్ పరారైనాడని, కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నామని రాఘట్ గాన్ పోలీసు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్ లో ఈ సంఘటన సంచలనం కలిగించింది.