కోడలిపై మామ లైంగిక వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?
చెన్నై: కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో మామకు నాలుగేళ్ళ జైలు శిక్షను విధిస్తూ తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు మహిళ కోర్టు బుధవారం నాడు తీర్పు చెప్పింది అంతేకాదు రూ.12 వేల జరిమానాను కూడ విధించింది.
తమిళనాడు రాష్ట్రంలోని అంబూరు ప్రాంతానికి చెందిన పి.సెల్వం కొడుకు శివ 2009లో ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకొన్నాడు. అయితే పన్నీర్ సెల్వానికి మద్యం తాగే అలవాటు ఉంది.

అయితే ప్రతి రోజూ మద్యం తాగి వచ్చి కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు ఆయనకు బాధితురాలు ఎంతగానో నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. కానీ అతడు వినలేదు. దీంతో బాధితురాలు నిందితుడిపై అంబూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఈ కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ చేశారు. కోర్టులో ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించారు. వేలూరు మహిళా కోర్టు బుధవారం నాడు తీర్పు చెప్పింది.
కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడు పి. సెల్వానికి నాలుగేళ్ళ జైలు శిక్షను విధించారు. మహిళల వేధింపు చట్టం కింద మరో ఏడాది జైలు శిక్షను ఏక కాలంలో అనుభవించాలని కోర్టు తీర్పు చెప్పింది.దీనికి తోడు మరో రూ.12 వేల జరిమానాను విధిస్తున్నట్టు జడ్జి తీర్పును వెలువరించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications