తమ భార్యలను తిట్టాడని స్నేహితుడ్ని చంపేశారు

Man killed for indecent comments on friend's wife
లక్నో: ముగ్గురు స్నేహితుల మధ్య చోటు చేసుకున్న చిన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. తమ భార్యలపై అసభ్యంగా మాట్లాడాడని ఆగ్రహానికి గురైన ముగ్గురు సహచరులు కలిసి మరో స్నేహితుడ్ని హత్య చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తాల్కతోరా ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధితుని బంధువుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సాదత్‌గంజ్‌లోని కత్రా కుడయార్ ఖాన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న బాధితుడు లవకుష్ మిశ్రా శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. ఆ తర్వాత అతని ఆచూకీ లభించకపోవడంతో బజర్ఖాలా పోలీసులను ఆశ్రయించారు.

కాగా తా్కతోరా ప్రాంతంలోని చత్రియా లాన్ దగ్గర లవకుష్ మిశ్రా మృత‌దేహం ఆదివారం లభ్యమైంది. అతని శరీరం పూర్తిగా కాలిపోయి ఉంది. పెట్రోల్ పోసి అతన్ని కాల్చివేసినట్లు పోలీసులు అంచనా వేశారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మిశ్రాను గుర్తించిన పోలీసులు, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మిశ్రా ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపారు.

ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా నిందితులైన బాలగంజ్, థాకూర్గంజ్‌లకు చెందిన అజయ్ వర్మ(36), వినాయక్ వర్మ అలియాస్ అన్షు(19), సాదత్‌గంజ్‌కు చెందిన జితేంద్ర కశ్యప్(34)లను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.

నిందితుల కథనం ప్రకారం.. శనివారం సాయంత్రం మిశ్రాతోపాటు ఈ ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అయితే ఈ సమయంలోనే చిన్న గొడవ తలెత్తింది. మద్యం ఎక్కువగా సేవించిన మిశ్రా.. మిగితా వారి భార్యల గురించి తప్పుగా, అసభ్యంగా మాట్లాడాడు. దీంతో ఆవేశానికి గురైన ముగ్గురు మిశ్రాపై దాడి చేసి, ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పింటించినట్లు నిందితులు అంగీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+