వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 40, బియ్యం కోసం యజమానిని హత్య చేశాడు

|
Google Oneindia TeluguNews

Man killed for Rs 40 and some rice
రాంచీ: తనకు ఇవ్వాల్సిన రూ. 40 వేతనం, బియ్యం ఇవ్వలేదని ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తన యజమానిని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ఘట్‌సిలాలోని భిటర్మిండాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యజమాని(52) ఓ గిరిజన వ్యక్తిని పశువులను మేపడానికి పనిలో పెట్టుకున్నాడు. అతడికి రూ. 40 జీతం, కొన్ని కొన్ని బియ్యం వేతనంగా ఇవ్వాలని నిర్ణయించాడు.

కాగా, అవి ఇవ్వడానికి ఆలస్యం చేస్తుండటంతో యజమానితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి యజమానిని కత్తితో పొడిచి హత్య చేశాడని దుమారియా పోలీసు అధికారి విపిన్ కుమార్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన ఆయన, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

యజమాని మృతదేహాన్ని గుర్తించినట్లు ఆయన తెలిపారు. అతని వద్ద పనిచేస్తున్న నిందిత వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

English summary
A 52-year-old man was knifed to death allegedly by his employee, who grazed his cattle, over outstanding wage of Rs 40 and some rice at Ghatsila in Jharkhand, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X