భార్యను హత్య చేసి, ఆమె ప్రియుడిపై కత్తితో వ్యక్తి దాడి

తన మిత్రుడితో అక్రమ సంబంధం ఉందనే ఆరోపణపై పెట్రోల్ బంక్ ఉద్యోగి అయిన సుధాకర్ కోయంబేడులో తన భార్యతో నిత్యం గొడవ పడుతూ వస్తున్నాడని పోలీసులు చెప్పారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుధాకర్ భార్య సుగంతి (27) సుధాకర్ మిత్రుడు ఎలాంగోవన్ (30)తో సాన్నిహిత్యం పెంచుకుంది. దీని గురించి తెలిసిన సుధాకర్ ఎలాంగోవన్తో మాట్లాడవద్దని భార్యను హెచ్చరించాడు.
అయితే, సుగంతి ఎలాంగోవన్తో సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. సుగంతి ఫోన్లో ఎలాంగోవన్తో మాట్లాడడం గమనించి ఆమెను హత్య చేయాలని సుధాకర్ నిర్ణయించుకున్నాడు. ఆ కాల్పై సోమవారం సాయంత్రం సుధాకర్ భార్యతో గొడవ పడ్డాడు. ఆమెను గొంతు నులిమి చంపి ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ఆ తర్వాత ఎలాంగోవన్ ఇంటికి వెళ్లి ఒంటరిగా ఉన్న అతనిపై కత్తితో దాడి చేశాడు.
ఎలాంగోవన్ కేకలు విని ఇరుగుపొరుగువారు వచ్చారు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఆ తర్వాత గుయిండీలోని న్యాయవాదిని వెంట పెట్టుకుని సుధాకర్ పోలీసులకు లొంగిపోయాడు.












Click it and Unblock the Notifications